ఆంధ్రప్రదేశ్లోని విలీన మండలాల సమీపంలో రైలు కూత వినిపించబోతోంది. గోదావరికి అవతలి వైపు కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీకి కలిసొస్తుంది. కేంద్రం ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి తెలంగాణలోని బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు 200.60 కి.మీ. పొడవుతో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పింది. మొత్తం రూ.4,109 కోట్ల వ్యయంతో ఈ లైను నిర్మాణం కాబోతోంది.. ఒడిశా నుంచి ఈ లైను గోదావరి అవతలి వైపున ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా వస్తుంది.. అక్కడి …
Read More »Masonry Layout
Bengaluru: నన్ను జైల్లో పెట్టండి కానీ.. భార్యతో ఉండలేను.. వేధింపులతో ఇంటి నుంచి పారిపోయిన టెక్కీ!
భార్య వేధింపులకు తాళలేక ఇళ్లు వదిలి పారిపోయాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడు నొయిడాలో ఉన్నట్టు గుర్తించారు. నచ్చజెప్పి అతడ్ని బెంగళూరుకు తీసుకురాగా.. భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోయాడు. అంతేకాదు, జైలుకి వెళ్లమన్నా వెళ్తా కానీ ఆమెతో జీవితం పంచుకోలేనని తెగేసి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర బెంగళూరులో భార్యతో కలిసి నివాసం ఉంటోన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ …
Read More »Bandi Sanjay: కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం.. టీపీసీసీ చీఫ్గా కేటీఆర్, కేసీఆర్కు ఏఐసీసీ, కవితకు రాజ్యసభ ఎంపీ
Bandi Sanjay: కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల్లో.. ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం …
Read More »AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …
Read More »40 కోట్ల మంది స్వాతంత్య్రం సాధిస్తే.. 140 కోట్ల మందితో వికసిత్ భారత్ సాధ్యమే.. మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే లక్ష్యంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘వికసిత్ భారత్’థీమ్తో నిర్వహిస్తున్నారు. అప్పటికి భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఆ సమయానికి భారత్ను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంపికి చేసింది. ఈ ఏడాది వేడుకలకు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు లఖ్పతీ దీదీ, డ్రోన్ దీదీ వంటి పథకాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు …
Read More »కశ్మీర్లో ముష్కర మూకల కోసం వేట.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కశ్మీర్లో ముష్కర మూకల కోసం గాలిస్తుండగా.. ఓ సైనికాధికారి అమరుడయ్యాడు. దోడా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది. శివ్గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా …
Read More »మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల: ఏమన్నారంటే?
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక …
Read More »తిరుమలలో 300 ఏళ్లుగా కొనసాగుతున్న వేడుక.. ఈ సారి జులై 24న..
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో పల్లవోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 24వ తేదీన తిరుమలలో పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది .మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జులై 24న పల్లవోత్సవం నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవం సందర్భంగా సహస్రదీపాలంకార సేవ తర్వాత.. శ్రీవారు కర్ణాటక సత్రానికి చేరుకుంటారు. శ్రీదేవీ, భూదేవీసమేతుడైన శ్రీనివాసుడు కర్ణాటక సత్రానికి చేరుకున్న తర్వాత.. కర్ణాటక ప్రభుత్వం తరుఫున వచ్చిన ప్రతినిధులు.. మైసూరు సంస్థానం ప్రతినిధులు.. స్వామివారికి హారతి సమర్పిస్తారు. అనంతరం …
Read More »నితిన్ వదిలిన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్.. బాల్యం గుర్తొస్తోంది
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందుతోన్నఈ చిత్రానికి యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్ను పూర్తి చేయటం విశేషం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో బాల్యమే …
Read More »Horoscope Today: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.8.51 వరకు, తదుపరి అష్టమినక్షత్రం: పుబ్బ తె.4.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.11.21 నుండి 1.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: రా.9.54 నుండి 11.40 వరకు. మేషం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు సన్మానాలు. …
Read More »