Tag Archives: ys jagan

జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకున్న జెడ్ ప్లస్‌ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయనే అంశాన్ని మాజీ సీఎం జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తన భద్రతపై సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది తనకు ఆటోమేటిక్‌ హక్కు అని.. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం …

Read More »

జగన్‌ రెంటపాళ్ల పర్యటనపై పొలిటికల్ రచ్చ.. ఎఫెక్ట్‌ ఎలా ఉండబోతోంది..?

వందమందే రావాలన్నారు.. కానీ వందలాది మందొచ్చారు..! ఆంక్షలున్నాయ్ అదుపులో ఉండాలన్నారు.. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్‌… అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్‌ పర్యటనపై పొలిటికల్‌ ఫైట్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. శాంతిభద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే.. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరీ టూర్‌ ఇంపాక్ట్‌ ఏపీలో ఎలా ఉండబోతోంది..? నమోదుకాబోయే కేసులెన్ని..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం..! వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపుచేయలేని …

Read More »

జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ జైలు వద్దకు వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్‌ జైలుకు వెళ్లారు..విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి …

Read More »

కూటమి నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడంలేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని.. నేతలంతా ధైర్యంగా ఉండాలన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని …

Read More »

వైసీపీ అధినేత జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా పార్టీని వీడుతున్న ముఖ్యనేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో అంతే ధీటుగా పార్టీకి గుడ్‌ బై చెప్పిన నేతలు రియాక్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డిలు వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత …

Read More »

వైఎస్ జగన్ మార్గంలో అస్సాం సీఎం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.?

ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దన్నగా ఉన్న అస్సాం తాజాగా మరో 3 రాజధానుల ప్రస్తావనతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి దిస్‌పూర్ (గువాహటిలో ఒక భాగం) రాష్ట్ర రాజధానిగా ఉంది. ఇది రాష్ట్రానికి పశ్చిమాన ఒక మూలన బ్రహ్మపుత్ర నదికి, హిమాలయ పర్వత సానువులకు మధ్యన విస్తరించి ఉంటుంది.అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారు. హిమాలయాలు, బ్రహ్మపుత్ర నదీ లోయ మధ్య సువిశాలంగా విస్తరించిన అస్సాం రాష్ట్రానికి దిబ్రూగఢ్‌ను రెండవ రాజధానిని చేస్తానని …

Read More »

అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేసింది.వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలీ, ఆయన బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో …

Read More »

కొత్త లెక్కలు వేస్తున్న వైసీపీ.. అగ్రనేత వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..?

సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ …

Read More »

 డైవర్షన్‌ పాలిటిక్స్‌.. డిప్యూటీ సీఎం ఆ షిప్‌ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేక ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా… ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ఆయన అన్నారు.సీఎం చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేక ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి …

Read More »

ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో జగన్..! నేతలకు నేరుగానే చెప్పేస్తున్న వైసీపీ అధినేత

పార్టీని వీడుతున్న వారిలో పదవులు అనుభవించిన వారు.. తాజాగా కీలక పదవుల్లో ఉన్నవారి సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతున్న జగన్ పార్టీ మారే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీని వీడే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత వైఎస్ జగన్ సందేశాన్ని ఇస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కాకుండా అధికారం లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లే నిజమైన కార్యకర్తలు అన్న సంకేతాన్ని పార్టీ …

Read More »