గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి సర్కార్‌ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. గండికోట, రాజమండ్రి పుష్కర్ ఘాట్‌ డెవలెప్‌మెంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడమే అందుకు నిదర్శమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజుల పరిపాలనకు సజీవ సాక్ష్యం అయిన గండికోట అభివృద్ధికి కేంద్ర టూరిజం శాఖ 77.91 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని గండికోట, పుష్కర్ ఘాట్‌కు కేంద్ర టూరిజం శాఖ నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఏపీలో గండికోటకు ప్రత్యేక గుర్తింపు ఉందని.. దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అంతేకాదు రాజమహేంద్రవరం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్ల నిర్మాణం చేపడతామన్నారు రామ్మోహన్‌నాయుడు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇక.. అరసవిల్లిని ప్రసాద్ స్కీమ్‌లో పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *