2024-25 అకడమిక్ సెషన్లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.
AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో CBSE అనుబంధ పాఠశాలల్లో ప్రవేశపెట్టినప్పటి నుండి, AI ప్రజాదరణ పొందుతోంది. CBSE AIని క్లాస్ VIIIలో 15-గంటల ఫౌండేషన్ మాడ్యూల్గా, IX నుండి XII తరగతులకు స్కిల్ సబ్జెక్ట్గా అందిస్తుంది. 30,373 CBSE అనుబంధ పాఠశాలల్లో, 29,719 పాఠశాలలు IT మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఎడ్యుకేషన్ బోర్డులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కోర్సు గురించి గుజరాత్ ఎంపీ రాజేష్భాయ్ చుడసామా లోక్సభలో ఓ ప్రశ్న అడిగారు. దానికి విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం చెప్పారు. దాదాపు 4,538 పాఠశాలల నుండి సెకండరీ స్థాయిలో AIని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. దాదాపు 944 పాఠశాలల నుండి దాదాపు 50,343 మంది విద్యార్థులు సీనియర్ సెకండరీ స్థాయిలో AIని ఎంచుకున్నారని కూడా ఆయన తెలిపారు. ఈ కోర్సు 8వ తరగతిలో 15 గంటల మాడ్యూల్గా, 9 నుండి 12వ తరగతి వరకు స్కిల్ సబ్జెక్ట్గా అందించబడుతుంది.