అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్‌ దాడి! మరో రెండు నెలల్లో పెళ్లి..

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై యువకుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వచ్చే ఏప్రిల్‌ 29న బాధితురాలికి వివాహనం నిశ్చయించారు. ఇంతలో ఎంత ఘోరం జరిగిదంటూ ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరుమూన్నీరుగా విలపిస్తున్నారు. యువతిపై ముందుగా కత్తితో దాడి చేసిన యువకులు ఆ తర్వాత ముఖంపై యాసిడ్‌ పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. కాగా, ఈ దాడికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే దాడికి గల కారణాలను పోలీసులు త్వరలోనే తెలిపే అవకాశం ఉంది.

About Kadam

Check Also

పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!

సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *