ఏపీలో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు మోస్తరు వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా ఉండబోతోంది. వాతావరణ సూచనలు ఏంటి.? వడగాల్పులు ఏయే జిల్లాల్లో వ్యాపించనున్నాయి. వర్షాలు ఏయే ప్రాంతాల్లో పడతాయి..? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు అంతర్గత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపోఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాం లలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. వేడి ,తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *