ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు..!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు మేలు చేసే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని సూచించారు.

ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై గురువారం (ఆగస్టు 28) అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఆధార్‌ తరహాలో ‘ఫ్యామిలీ కార్డు’ ఇవ్వాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపర్చాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలని.. ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ముఖ్యమంత్రి.. అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైన్‌ అంశం పరిశీలిద్దామన్నారు. త్వరలోనే పాపులేషన్‌ పాలసీ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *