జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగ్రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.
2025 మహాకుంభమేళాలో మూడు అమృతస్నానాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రయాగ్రాజ్లోకి భక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగ్రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.
ఈ మేరకు రైల్వే శాఖ వివరాల ప్రకారం.. ప్రజలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, రంగు-కోడెడ్ టిక్కెట్లు, ప్రత్యేకించిన షెల్టర్ స్లాట్లను కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణీకులు తమ షెడ్యూల్ చేయబడిన రైలు బయలుదేరే సమయానికి ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. సివిల్ పోలీసుల సమన్వయంతో, స్థానిక టాక్సీ, ఆటో, ఇ-రిక్షా డ్రైవర్లు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, యాత్రికులకు సజావుగా గమ్యస్థానాలకు చేర్చేలా సరైన మార్గాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.