ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగపర్చేందుకు ఉద్దేశించిన పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటం, టెక్స్ట్ టైల్, సమీకృత పర్యాటకం, స్పోర్ట్స్ పాలసీలకు ఆమోదం తెలపడంతో పాటు గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై చర్చించింది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కొనసాగింది ఏపీ మంత్రివర్గం. కాకినాడ పోర్ట్, గౌతమ్ ఆదానీ వ్యవహారంపై భేటీలో కీలకంగా చర్చించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించిన నిర్మాణ పనులను 11,467కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29, కోవర్కింగ్ …
Read More »వీడెవడండీ బాబూ.. ఒక్క అరటి పండును రూ.52 కోట్లకు కొని ఎలా తిన్నాడో చూడండి..
ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. ఆ తర్వాత కూడా ఇదే ధరకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత కాటెలన్ దీని ధరను పెంచారు. తాజా వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్ డాలర్లకు అమ్ముడోపోయి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలోకేవలం 5రూపాయలు విలువ చేసే అరటి పండు 52కోట్లకు అమ్ముడు పోయింది.. ఆర్ట్వర్క్ పేరుతో 52 కోట్లు పెట్టి సింగిల్ అరటి పండును కొన్నాడు ఓ వ్యాపారవేత్త..! అంతేకాదు.. అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో ఆ అరటిపండును …
Read More »సీఎం స్టాలిన్కు ప్రధాని మోడీ ఫోన్.. అన్ని విధాల సహయానికి హామీ!
PM Modi: తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలోని విల్లుపురం జిల్లాలో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా అపూర్వమైన వరదలు సంభవించాయి. ‘ఫంగల్’ తుఫాను తమిళనాడులో భారీ విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా వరదలు రాష్ట్రంలో భారీ నష్టం కలిగించాయి. ఈ బీభత్సంలో చాలా మంది మరణించారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తు, అక్కడి పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్తో …
Read More »హోం మంత్రి సడన్ సర్ప్రైజ్.. ఆమె చేసిన పనికి అవాక్కైన అధికారులు..
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. వెళ్తూ వెళ్తూ కాన్వాయ్ని ఆపి వాహనం దిగారు. అక్కడే రోడ్డుపై ఉన్న చాయ్ దుకాణనికి వెళ్లారు. హోం మంత్రి లాంటి టీ కొట్టుకు రావడంతో అంతా అవ్వక్కయ్యారు. పోలీసుల హడావుడి పెరిగింది. హోం మంత్రి సెడన్గా కాన్వాయ్ ఆపి దిగగానే ఆ షాపు యజమానికి కూడా కాస్త కంగారు పడ్డాడు. హోం మంత్రి స్వయంగా రావడంతో అక్కడ ఏదో జరిగి ఉంటుందని కొందరు అనుకుంటే.. మరికొందరైతే ఆసక్తిగా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు.. అక్కడకు …
Read More »Cloves Benefits: లవంగంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండోయ్..! తప్పక తెలుసుకోవాల్సిందే..
లవంగాలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదంలో లవంగాలను పూర్వం నుంచి ఉపయోగిస్తున్నారు. లవంగాలు సీజనల్ వ్యాధులు,ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచేలా చేస్తాయి. కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం నుండి ఎముకల ఆరోగ్యం వరకు లవంగాలతో కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాల వినియోగం …
Read More »భారీ వర్షం.. సినిమా చూసేందుకు కారులో బయలుదేరిన వైద్య విద్యార్థులు.. దారి మధ్యలో ఉండంగా..
అందరూ వైద్య విద్యార్థులే.. వారంతా సినిమా చూసేందుకు సరదాగా కారులో బయలుదేరారు.. ఈ క్రమంలోనే.. రాత్రి వేళ ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు.. బస్సు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలప్పుజ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు ప్రాణాలు …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి.. హరీష్రావుతోపాటు మాజీ డీసీపీపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి సంచలనంగా మారుతోంది. తాజాగా మాజీ మంత్రి హరీష్రావుపై కేసు నమోదయ్యింది. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై కేసు నమోదు అయ్యింది. మాజీమంత్రి హరీష్రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్గౌడ్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి ఈ ఫిర్యాదు చేశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే …
Read More »కన్నీళ్లకే కష్టాలు..! లారీ ప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానిది.. ఒక్కొక్క కథ..!
వేగంగా దూసుకువచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న వారిపైనుంచి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ వేగానికి చెట్టు కూడా కుప్పకూలిపోయింది..రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవే రోడ్డుపై లారీ బీభత్సంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే..! ఈ ఘటనతో మృతుల కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది. ఒకరు తమ పెద్దదిక్కును కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, మరొక కుటుంబంలో కన్నతల్లిని కోల్పోయారు. ఇటీవల పరీక్షలు రాసి రైల్వే ఉద్యోగం …
Read More »మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రాజా వెంకటాద్రి సంచలన తీర్పు చెప్పారు… 2017లో 15 ఏళ్ల మైనర్ విద్యార్దినికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మ్యాథ్స్ టీచర్ అప్సర్ బాషాకు శిక్ష ఖరారు చేశారు… నిందితుడిపై నేరం రుజువైనందున మరణించేవరకు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించారు… బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించేలా చూడాలని న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని ఓ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికతో(15) అదే స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పని …
Read More »నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఒకేసారి రెండు జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal