నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. కొంతమంది జుట్టుకు రంగులు కూడా వేస్తున్నారు.. అయితే చిన్న వయసులోనే నెరిసిన వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. నేటి కాలంలో, చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య బాగా పెరిగింది. ఒకప్పుడు వృద్ధుల్లో ఈ సమస్య కనిపించేది.. కానీ.. ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారి జుట్టు కూడా బూడిద రంగులోకి మారి.. క్రమంగా తెల్లబడుతోంది.. మీకు కూడా ఈ సమస్య …
Read More »PM Modi: ప్రధాని మోడీ వికసిత్ భారత్లో భాగమవ్వండి.. యువతకు పిలుపునిచ్చిన పీవీ సింధు, ఆయుష్మాన్ ఖురానా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన వికసిత్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అయుష్మాన్ ఖురానా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భాగమయ్యారు. ఈ మేరకు వికసిత్ భారత్ ఛాలెంజ్ లో పాల్గొని దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారీ స్టార్ సెలబ్రిటీలుజాతీయ యువజనోత్సవం -2025 ను పురస్కరించుకుని ఇటీవల ప్రధాని మోడీ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో …
Read More »Adani Group: రూ.2100 కోట్ల లంచం ఆరోపణ.. అమెరికాలో కేసు.. అదానీ గ్రూప్ స్పందన ఇదే!
Adani Group: రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను కొట్టిపారేసింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. అక్కడి చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని స్పష్టం చేసింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏకంగా …
Read More »భారీ భద్రతా వైఫల్యం.. బ్రిటన్ రాజసౌధంలోకి చొరబడ్డ ముసుగు దొంగలు.. !
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బ్రిటన్ రాజ భవనంలోకి ముసుగు దొంగలు చొరబడటం కలకలం రేపుతోంది. కింగ్ ఛార్లెస్ (King Charles) దంపతులు అప్పుడప్పుడు సేదదీరే విశ్రాంతి మందిరం విండ్సర్ క్యాజిల్ (Windsor Castle)లోకి చోరులు ప్రవేశించారు. ఫెన్సింగ్ దూకి ఎస్టేట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ట్రక్కు, బైక్ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రాజ కుటుంబానికి చెందిన ఎవరూ అక్కడ లేనప్పటికీ.. ఈ ఘటన ఎస్టేట్ భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా …
Read More »Canada: దేశం నుంచి కెనడియన్లనే వెళ్లిపొమ్మంటున్న ఖలిస్థానీలు.. కెనడా మాదే అంటూ నినాదాలు
Canada: రోజురోజుకూ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట నానా హంగామా సృష్టిస్తున్న ఖలిస్థానీలు.. తాజాగా తెల్లజాతివారిపై పడ్డారు. తాజాగా కెనడాలోని శ్వేత జాతీయులను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైనా కెనడా తమదేనని.. తెల్లజాతివారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతజాతీయులు అంతా యూరప్కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్థానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో.. కెనడాకు యజమానులం తామేనని …
Read More »Donald Trump: తులసి గబ్బర్డ్కు ట్రంప్ కీలక పదవి.. హిందువే గానీ భారతీయురాలు కాదు, అసలు ఆమె ఎవరు?
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. తన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ పదవుల్లో కీలక వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్తోపాటు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి ఇటీవలె పలు కీలక పదవులను కట్టబెట్టారు. తాజాగా తులసి గబ్బర్డ్ను అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. ఇక తులసి గబ్బర్డ్ మాజీ డెమోక్రట్ కావడం గమనార్హం. అయితే తులసి గబ్బర్డ్ హిందూ కావడంతో ఆమె ఎంపిక ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయురాలు …
Read More »ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి ఈ మూడు ప్రాంతాలు.. కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పరిధిని తిరిగి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజధాన పరిధిని మళ్లీ 8,352.69 చదరపు కిలో మీటర్లకు ప్రభుత్వం పెంచింది. పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థల్లో గత ప్రభుత్వం విలీనం చేసిన ప్రాంతాన్ని తిరిగి సీఆర్డీఏలోకి కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని 92 గ్రామాల్లో 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, సత్తెనపల్లి మున్సిపాలిటీ, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని 562.41 చదరపు కిలో మీటర్ల …
Read More »పుతిన్కు ఫోన్ చేసిన ట్రంప్.. ఉక్రెయిన్తో యుద్దంపై కీలక సూచన
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో సంభాషించినట్టు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని మరింత పెంచుకోవద్దని ట్రంప్ సూచించినట్టు పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజుల తర్వాత ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ నుంచి పుతిన్కు గురువారం ఫోన్ చేశారని తెలిపింది. దీనిపై ట్రంప్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు స్పందించడానికి నిరాకరించినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ వ్యాఖ్యానించింది. పుతిన్తో కాల్లో మాట్లాడిన ట్రంప్.. ఐరోపాలో అమెరికా గణనీయమైన …
Read More »విదేశంలో మెట్రో రైళ్లు నడపనున్న హైదరాబాద్ మహిళా లోకో పైలట్ ఇందిర.. హ్యాట్సాఫ్
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్లో సత్తా చాటనున్నారు. రియాద్లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల …
Read More »Donald Trump: ట్రంప్ గెలుపు.. అమెరికాను వీడనున్న హాలీవుడ్ హీరోయిన్లు, కారణం ఇదే!
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అడుగుపెట్టనున్న వేళ.. కొందరు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు హాలీవుడ్ హీరోయిన్లు.. తాము అమెరికాను విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిపోతామని ప్రకటిస్తు్న్నారు. అయితే రోజురోజుకూ ఈ సంఖ్య పెరగడం అమెరికాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎలాన్ మస్క్ ట్రాన్స్జెండర్ కుమార్తె కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడిగా …
Read More »