ఏపీలోని ధర్మవరానికి చెందిన సయ్యద్ ఫరూక్ అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తనకు చెప్పిన ఉద్యోగం కాకుండా ఫరూక్తో ఇతర వేరే పనులు చేయించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుకు ఫరూక్ వీడియో కాల్ చేసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. దీనిపై వెంటనే స్పందించిన హరీష్ బాబు, ఈ …
Read More »రోడ్డుపై వెళ్తుండగా కనిపించిన తెల్లటి కవర్.. ఏముందా అని చూడగా.. అమ్మబాబోయ్
శ్రీశైల మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బులెట్స్ వెలుగు చూడడం కలకలం రేపింది. స్ధానిక వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో బులెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్. బాంబ్ స్క్వాడ్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్కు చెందిన ఐదు బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్కు చెందిన నాలుగు …
Read More »ఏ సీజన్లో దొరికే పండ్లతో ఆ సీజన్లో వెంకన్నకు అలంకారం.. భక్తులకు ప్రత్యేక సందేశం..
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. భక్తులు ఈయన్ను పరిపరి విధాలుగా కొలుస్తుంటారు. తిరుమల తిరుపతి నుంచి ద్వారకాతిరుమల వెంకన్న , వాడపల్లి శ్రీనివాసుడు ఇలా ప్రాంతం స్థలం ఏదైనా భక్తుల సేవలు , పూజలు ఆయా ఆలయాల్లో ఘనంగా జరుగుతుంటాయి. సాధారణం ఆలయ , ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలు , అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు ఎందుకంటే..వెంకన్న కొలువు తీరిన ఆలయాల్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరపుపాడు గ్రామం ఒకటి. …
Read More »రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం
వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మిర్చి, పొగాకు, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించలేదు. దీంతో రైతులు కొంతమేర ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో ముందస్తుగా సాగుకు సిద్దమైనా.. ప్రస్తుతం వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగటం లేదు. దీంతో విత్తనాలకు డిమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసి నాటడం కూడా మొదలు పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల …
Read More »D-రిజర్వ్డ్ టికెట్ గురించి తెలుసా..? రిజర్వేషన్ లేకుండానే స్లీపర్ కోచ్లో ప్రయాణించవచ్చు!
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన డి-రిజర్వ్డ్ టిక్కెట్ల గురించి మీకు తెలుసా? ఇవి రైలు బయలుదేరే ఒక గంట ముందు రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఖాళీ స్లీపర్ బెర్తుల్లో ప్రయాణించేందుకు ఇవి అనుమతిస్తాయి. గరిష్టంగా 100 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు. రైళ్లలో లాంగ్ జర్నీ చేసేవారు.. ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటారు. కొన్ని సార్లు సడెన్గా ఎక్కడికైనా వెళ్లా్ల్సి వచ్చిన సమయంలో తత్కాల్ టిక్కెట్ల కోసం చూస్తారు. అవి కూడా దొరకకుంటే.. ఇక వారికి జనరల్ బోగీలో దిక్కు. ఇక జనరల్ …
Read More »సినిమాల్లో ఛాన్స్ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!
సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ప్రవేశాలు పొందండి. 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ FTII నోటిఫికేషన్ విడుదల చేసింది. నటన మాత్రమే కాదు దర్శకత్వం, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష …
Read More »హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
Read More »భార్యను చంపేందుకు రవిశంకర్ పక్కా ప్లాన్.. అరెస్ట్తో అడ్డం తిరిగిన అసలు కథ!
అనుమానం పెంచుకుని భార్య చంద్రికతోపాటు కన్నబిడ్డల (లక్ష్మీ హిరణ్య 9 ఏళ్లు, లీలసాయి ఏడేళ్లు)ను పొట్టనపెట్టుకున్న రవిశంకర్ కేసులో మరో షాకింగ్ విషయం బయటపడింది. భార్య బిడ్డలను చంపి అదృశ్యమైన అతగాడిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన అరెస్ట్ చేయడంతో అసలు కథ అడ్డం తిరిగింది. రవిశంకర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు.. అతనిలోని సైకోయిజం తాలుకు వివరాలను ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తున్నారు..పదేళ్ల కిందటే భీమవరంలో చంద్రికను ప్రేమించి వివాహం చేసుకున్న రవిశంకర్, తన భార్య మరొకరితో పదేపదే పోన్ కాల్స్ మాట్లాడటం చూసి …
Read More »డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
ఎల్ఐసీ హైసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్సీఎల్) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, …
Read More »శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!
భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు.. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లో కూడా కియోస్క్లు అందుబాటులో ఉంటాయి.తిరుమల వెళ్లే భక్తులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..ఇకపై శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం …
Read More »