ఆంధ్రప్రదేశ్

అవన్నీ అవాస్తవాలు.. భక్తులు నమ్మొద్దంటూ టీటీడీ విజ్ఞప్తి.. ఎందుకంటే

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుంటారు. అయితే తిరుమల క్షేత్రంలో హోటల్స్ లో లభించే ఆహారపదార్ధాల ధరల గురించి టీటీడీ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.తిరుమల తిరుపతి క్షేత్రం హిందువులకు పరమ అవిత్రమైన స్థలం. కలియుగ వైకుంఠం క్షేత్రం తిరుమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. కోనేటి రాయుడి కోసం తిరుమలకు చేరుకుంటారు. …

Read More »

అంజనీపుత్రునికి 10 వేల వడలతో అభిషేకం.. ఎక్కడంటే…?

దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.ఆంజనేయ స్వామికి వడలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనకు చాలామంది భక్తులు వడలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఈ వడలనే మాలగా కూర్చి వడ …

Read More »

పాశమైలారం ప్రమాదంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.. ఫార్మా ఇండస్ట్రీస్‌లో తప్పనిసరి ప్రోటోకాల్స్

పాశమైలారం ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో సెఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలి, మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ ఏపీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదం అంతులేని విషాదం నింపింది. బాధితుల ఆర్తనాదాలతో ఫ్యాక్టరీ ప్రాంగణం సహా హాస్పిటల్ పరిసరాలు కంటతడి పెడుతున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు దారలైపోతున్నాయి. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు. పాశమైలారం ప్రమాదంతో …

Read More »

తిరుమలలో చిరుత సంచారం.. అన్నమయ్య భవన్ సమీపంలో మాటువేసి..

చిరుతను మొబైల్ లో క్యాప్చర్ చేసిన యువకులు అటవీ ప్రాంతంలోకి తరిమేసే ప్రయత్నం చేసారు. ఆటో, బైక్ లైటింగ్ సాయంతో శబ్దాలు చేస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడే మాటు వేసిన చిరుత ఆ తరువాత అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డులో వెళ్లేవాళ్లు, కంటి ఆసుపత్రికి వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు.శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జనాన్ని భయపెడుతున్నాయి. జనావాసాల్లోకి వచ్చి సందడి చేస్తుండడంతో భక్తుల్లో అలజడి రేపుతోంది. జులై 1 …

Read More »

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కట్‌చేస్తే.. తిరుమల శేషాచలంలో కదిలిన డొంక..!

శేషాచలం అటవీ ప్రాంతం దట్టమైన అడవులు అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయం. అయితే ఈ మధ్య స్మగ్లర్ల బెడద శేషాచలం కొండల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎర్రచందనం స్మగ్లర్ల అలజడి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే ఇప్పుడు ఏనుగుల దంతాల కేసు మూలాలు శేషాచలం అటవీ ప్రాంతానికి ముడి పెట్టడంతో అటవీశాఖలో ఆందోళన ప్రారంభమైంది. ఎర్రచందనం చెట్లు నేలకొరుగుతున్నట్లే వన్యప్రాణులు కూడా అంత మొందుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా హైదరాబాదులో నమోదైన ఏనుగు దంతాల కేసు ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖను భయపెడుతోంది. …

Read More »

మినీ యుద్ధ ట్యాంకర్ ను తయారు చేసి.. దేశ రక్షణకు నేను సైతం అంటున్న కాకినాడ కుర్రోడు

పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరిగిన ప్రతిసారి దేశ రక్షణలో తను కూడా భాగస్వామ్యం అవలేనందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఓ యువకుడు. యుద్ధంలో పాల్గొనేందుకు తనకి వీలు లేకపోవడంతో యుద్ధానికి ఉపయోగపడే ఓ డమ్మీ వెపన్ లను, యుద్ధ ట్యాంకర్ వాహనాన్ని. తయారు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేస్తే దేశ రక్షణ కోసం యుద్ద పరికరాలు చేస్తానని చెబుతున్నాడు.కాకినాడ జిల్లాకు చెందిన యువకుడు గతంలో ఏకీ 47, ఆర్ ఎఫ్ ఎల్ రైఫిల్, మినీ యుద్ధ …

Read More »

ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రూ. 15 వేలు కావాలంటే ఇలా చేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న “తల్లికి వందనం” కార్యక్రమానికి నేటితో (జూలై 2, మంగళవారం) చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకే ఆఖరి అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లులు అవసరమైన వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ “తల్లికి వందనం” పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం …

Read More »

ఆషాడ మాసంలో.. శాంకాంబరిగా అన్నపూర్ణమ్మ ప్రత్యేక అలంకరణ!

భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. సోమేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి..పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. …

Read More »

పాకీజా దీన స్థితికి చలించిన పవన్ కల్యాణ్.. నటికి తక్షణ సాయం.. ఎంతంటే?

ఒకప్పుడు పాకీజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటి వాసుకి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. తనను ఆదుకోవాలంటూ ఆమె ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశారు. నటి దీన స్థితిని చూసి చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాకీజాకు తక్షణ సాయం ప్రకటించారు.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు …

Read More »

మనుషుల ప్రాణాలంటే జగన్‌కు లెక్కలేదు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్‌కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలతో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం …

Read More »