బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 2025న దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ‘పరీక్ష పే చర్చ’ 8వ ఎడిషన్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో.. తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్స్గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర పిల్లల్లాగే ఉండేలా చూడాలని, మీ పిల్లలు వారికి అత్యంత ఆసక్తి ఉన్న అంశాల గురించి చదివేలా చేయాలని మోదీ సూచించారు. పిల్లలు …
Read More »తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.. వరుసగా 3 రోజుల సెలవులు!
విద్యార్థులకు గుడ్న్యూస్. ఎందుకంటే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. విద్యార్థులకు ఒక సెలవులు వస్తున్నాయంటే చాలు తెగ సంబరపడిపోతుంటారు. అలాంటిది ఏకంగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు. మరి ఈ మూడు రోజుల సెలవులు ఎందుకు రానున్నాయో చూద్దాం.. సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు పండగే. ఫిబ్రవరి 14, 15,16 తేదీలలో సెలవులు వస్తున్నాయి.ఇక ఉద్యోగులు …
Read More »మెడికల్ కాలేజీలపై యూజీసీ కన్నెర్ర.. ఏకంగా 18 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ
నిబంధనలు పాటించని మెడికల్ కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు 18 మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ఆంధ్రపదేశ్లో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా.. తెలంగాణ నుంచి ఎంతో చారిత్రక రికార్డు ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉండటం గమనార్హం..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పలు వైద్యా కాలేజీలపై కన్నెర్ర చేసింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని దాదాపు 18 మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ …
Read More »పదో తరగరతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రణ.. లీకులకు కళ్లెం పడేనా?
రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మరో వైపు అధికారులు కూడా పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి పదో తరగతి పశ్నాపత్రాలు లీకేజీలకు తావులేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తొలిసారి ప్రశ్నాపత్రాలపై విద్యాశాఖ క్యూఆర్ కోడ్ ముద్రించనుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మర్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు ముమ్మరంగా …
Read More »నీట్ యూజీ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో ఎంబీబీఎస్తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతేడాది నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే..దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్ …
Read More »తెలంగాణ టెట్లో 83,711 మంది ఉత్తీర్ణత.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. రెండు పేపర్లకు కలిపి మొత్తం 83,711 మంది అభ్యర్ధులు త్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 31.21 శాతం మంది మాత్రమే టెట్లో ఉత్తీర్ణత పొందారన్నమాట. నిజానికి టెట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షకు 2,05,278 మంది పరీక్ష రాశారు..తెలంగాణ రాష్ట్రంలో టెట్-2024 రెండో విడత పరీక్షలు గత నెలలో ఆన్లైన్ విధానంలో నిర్వహించగా తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. రెండు పేపర్లు కలిపి 83,711 మంది ఉత్తీర్ణత …
Read More »ఇంటర్ హాల్టికెట్లు వచ్చేశాయ్.. వాట్సప్లో నేరుగా డౌన్లోడ్ చేసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు శుక్రవారం (ఫిబ్రవరి 7) ఇంటర్ హాల్టికెట్లను విడుదల చేసింది. అయితే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తోపాటు ఈసారి వాట్సప్ గవర్నెన్స్లో కూడా ఇంటర్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ …
Read More »ఇకపై పేపర్ లీక్ చేస్తే దబిడి దిబిడే.. విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు తొలిసారిగా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. పబ్లిక్ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు చర్యలకు ఉపక్రమించింది..తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ …
Read More »తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టిన వ్యక్తిని.. చూసి షాక్ తిన్న విద్యార్థి..!
పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ఐదు రూపాయల సొంత డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడుతుంటారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. విద్యా విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించారు. గరిటే చేత పట్టి విద్యార్థులకు …
Read More »తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షలు షురూ.. టైం టేబుల్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయి. ఇవి ముగిసిన తర్వాత ఏపీలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో షెడ్యూళ్లు వచ్చేశాయ్..తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు …
Read More »