తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. రోజూ వెంకన్న భక్తులతో ఏడు కొండలు నిండిపోతాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో …
Read More »కాలయముడుగా మారిన కేర్ టేకర్.. నమ్మి అప్పజెప్పినందుకు గొంతు కోసి పరార్
టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఒక వృద్ధురాలి హత్య సంచలనంగా మారింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మలపై కన్నేసిన కేర్ టేకర్ దురాశ.. 73 ఏళ్ల ధనలక్ష్మి హత్యకు కారణం అయ్యింది. ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న ధనలక్ష్మి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి కేర్ టేకర్ ఒడిగట్టిన పరిస్థితి దాపురించింది. పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం జరిగింది. రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు …
Read More »శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్.. ఒక్కరోజు ఆదాయం ఎన్ని కోట్లంటే..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచ వ్యాప్త భక్తులకు కొంగు బంగారమైనాడు శ్రీనివాసుడు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే కూడా భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా, స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇటీవల టీటీడీ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు …
Read More »తిరుమలలో చిరుత కలకలం.. గంగమ్మ ఆలయంలో పిల్లి మీద దాడికి యత్నం
గత వారం రోజులుగా బాలాజీ నగర్ ప్రాంతానికి చీకటి పడితే చాలు వచ్చేస్తున్న చిరుతలు రోజు ఏదో ఒకచోట స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 1000 కి పైగా కుటుంబాలు నివాసం ఉన్న బాలాజీ నగర్ పరిసరాల్లో ఉండే కుక్కలు పిల్లులు కోసం చిరుతలు వస్తున్నాయి. కుక్కల్ని పిల్లులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే బాలాజీ నగర్ లోని బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద మాటువేసి.. శేషాచలం కొండల్లోని చిరుతలు జనావాసాల వైపు పరుగులు పెడుతున్నాయి. తిరుమల అడవుల్లో పెరుగుతున్న చిరుతల సంతతి …
Read More »నేటి నుంచి శ్రీవారి దర్శనం మరింత సులభం..! ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ కోటా కింద టిక్కెట్లు కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టిక్కెట్లను, విమానాశ్రయంలో 200 టిక్కెట్లను అందిస్తుంది. ఇకపోతే, ఆగస్టు 2025 లో తిరుమలలో విశేష పర్వదినాలు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్ ఉన్న భక్తులకు ఒకే రోజు దర్శనం కల్పించే పైలట్ ప్రాజెక్ట్ను …
Read More »తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్.. శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు
శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్పై దర్శనానికి 3 రోజుల సమయం పడుతోంది. ఇకపై ఏ రోజు టికెట్ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనుంది. భక్తుల వసతికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వసతి సమస్యను అధిగమించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భక్తులకు వసతి ఇబ్బందులు రాకుండా ఎన్నో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు చేస్తూ …
Read More »టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…ఎవరు అర్హులంటే?
సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవాలు ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయక’లక్షణాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి, తిరుమలలోనిప్రాథమిక విద్య నుంచే విద్యార్థుల్లో భక్తి భావం పెంచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సద్గమయ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని టిటిడికి …
Read More »రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..
కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల …
Read More »శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు… వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు
స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు …
Read More »తిరుపతి శివాలయంలో కళ్లు తెరిచిన శివలింగం.. పరమేశ్వరుడి మహత్యమేనంటూ..
టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్లో రికార్డు చేశారు. …
Read More »