విజయనగరం

ఆ గ్రామాలపై సీఎం స్పెషల్ ఫోకస్.. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు

వివాదాస్పద కొటియా గ్రామాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏళ్ల తరబడి నానుతూ వస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. అయితే ఏపీ విజ్ఞప్తితో కేంద్రం చొరవ చూపుతుందా? పట్టువిడిచేలా ఒడిశాను ఒప్పిస్తుందా? అసలు గిరిజన గూడేలా గోడేంటి? ఆ వివరాలు ఇలాఆంధ్రా – ఒడిశా సరిహద్దులో కొటియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మధ్య కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఒడిశా అడ్డుకుంది. ఈ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మ్యాటర్‌ని సీఎం …

Read More »

కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత

పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి …

Read More »

అద్దె గర్భంతో పుట్టిన అరుదైన ఆవు దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనం

ఇటీవల కాలంలో పలు జాతుల ఆవుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పశు వైద్యాధికారులు ఈ సరోగసి విధానం ద్వారా మేలు జాతి ఆవుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సాహివాల్, గిర్, ఒంగోలు జాతుల వంటి అంతరిస్తున్న ఆవుల ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించి ఈ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా..అద్దె గర్భంతో పిల్లలు పుట్టడం ఇటీవల మనం తరుచూ చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీలలో అయితే సర్వసాధారణంగా మారింది. అయితే అదే తరహా అద్దె గర్భం ద్వారా …

Read More »

రెయిన్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకువస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి.. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా …

Read More »

పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. అనుమానమొచ్చి చెక్ చేయగా

పోలీస్ నేమ్ బోర్డుతో ఓ వెహికల్ ఒడిశా నుంచి ఏపీలోకి ఎంటరైంది. మొదట ఆ వాహనంపై ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేయగా..పోలీస్ నేమ్ బోర్డుతో ఒడిశా నుంచి ఏపిలోకి స్పీడ్‌గా దూసుకొస్తుంది ఓ బొలెరో వెహికల్. పోలీస్ వెహికల్ కదా ఏదో మేజర్ క్రైమ్ జరిగి ఉంటుందనుకొని ఎవరికి వాళ్లే చెక్ పోస్ట్స్ దగ్గర చెక్ చేయకుండా హడావుడిగా వదిలేశారు. అలా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ పోలీస్ వెహికల్ విజయనగరం జిల్లా రామభద్రపురం …

Read More »

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్‌ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్‌ చేశారు. అందులోని 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీ, రెండు బొలెరో వాహనాలు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు …

Read More »

తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఫెయింజల్ తుఫాన్ అలజడి రేపింది.. తీరం దాటినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం (డిసెంబర్ 02, 2024) IST 08 30 గంటల సమయంలో ఉత్తర అంతర్గత తమిళనాడు మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం (తుఫాను”ఫెయింజల్”) అదే ప్రాంతంలో కొనసాగుతొంది. డిసెంబర్ 3, 2024 నాటికి అవశేష అల్పపీడన ప్రాంతం, ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగే అవకాశము ఉన్నది. …

Read More »

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మె్ల్సీ ఇందుకూరి రఘురాజు.. తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »