విజయనగరం

ఏటి ఇది.. అసలు ఏటిది.. పొద్దున్నే లేచి చూసేసరికి ఇంటి ముంగిట..

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చోటుచేసుకున్న సంఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. రంగరాయపురంలో ఓ ఇంటి ముందు భయానక దృశ్యం కనిపించింది. ఇంటి ముందు ముగ్గులు వేసి, మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి, మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు, కుంకుమ రాసి భయానక పూజలు జరిగి కనిపించాయి. ఈ దృశ్యం చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పని ఎవరు చేశారు అన్న అనుమానాలు …

Read More »

తండ్రికి తగ్గ తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు!

తండ్రి స్పూర్తితో దేశం మెచ్చే క్రీడాకారుడిగా మన్ననలు పొందుతున్నాడు విజయనగరం జిల్లా కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి భారత్‌కు కాంస్య పథకాన్ని తెచ్చిపెడితే.. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజయ్‌ స్వర్ణ పథకాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పెరుతెచ్చుకున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత …

Read More »

ప్రధాని మోడీ మెచ్చిన అరకు కాఫీ గింజలతో.. యువకులు గణపతి విగ్రహం తయారీ..పోటెత్తుతున్న భక్తులు

ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ అందరి చూపును …

Read More »

మరోసారి ఉలిక్కిపడ్డ విజయనగరం.. ఉగ్రకుట్ర కేసులో మరో కీలక సూత్రధారిని అరెస్ట్..!

విజయనగరం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసు మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరొక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్‌ను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అబూ తలిబ్‌ను ఎన్ఐఏ సిబ్బంది అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టైన …

Read More »

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్ వినాయక మండపం కూడా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని పొనుగుటివలస గ్రామం వినాయకచవితి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఈ గ్రామస్తులు నిర్వహించే వినాయకచవితి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ …

Read More »

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది. తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో …

Read More »

వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యాపాారి బలి.. సంచలనంగా మారిన ఆడియో రికార్డ్..

వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు …

Read More »

దేశం ఖ్యాతిని పెంచిన తాపీ మేస్త్రీ కూతురు.. వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు గోల్డ్ మెడల్స్..

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది విజయనగరం జిల్లాకు చెందిన యువతి. కడు పేదరికంలోనూ ఏషియన్ జూనియర్ వెయింట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించి దేశం ఖ్యాతిని పెంచింది. చిన్న పల్లెటూరు నుంచి అంతర్జాతీయ వేదిక దాకా సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పేదరికంలో పుట్టిన ఆ యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నిలిచింది. తండ్రి తాపీ పనిచేస్తే తప్ప రోజు గడవని స్థితి నుండి దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంకు చెందిన …

Read More »

పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీస్‌కు పిలిపించుకుని మరీ రూ.లక్ష ఎందుకిచ్చారంటే?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన విజయ నగరం జిల్లాకు చెందిన ఓ ఇంటర్మీడియెట్ కుర్రాడిని ప్రత్యేకంగా తన ఆఫీస్ కు పిలిపించుకుని మరీ అభినందించారు. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ …

Read More »

 బాత్రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్.. ఆ తర్వాత.!

ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూం‌లోకి వెళ్లగా.. ఆమెకు ఆ బాత్రూం కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం రావడాన్ని గుర్తించింది. వెంటనే అక్కడ ఏముందా అని చూడగా.. దెబ్బకు కనిపించింది చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అసలు ఏమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించి.. ఎందుకలా చేశావ్ అని అడిగిన ఆమె భర్తపై దాడి చేసిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పోలాకి గౌరీ …

Read More »