ఆంధ్రప్రదేశ్

 బాత్రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్.. ఆ తర్వాత.!

ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూం‌లోకి వెళ్లగా.. ఆమెకు ఆ బాత్రూం కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం రావడాన్ని గుర్తించింది. వెంటనే అక్కడ ఏముందా అని చూడగా.. దెబ్బకు కనిపించింది చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అసలు ఏమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించి.. ఎందుకలా చేశావ్ అని అడిగిన ఆమె భర్తపై దాడి చేసిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పోలాకి గౌరీ …

Read More »

నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన… జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉ.10గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 11.00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం శ్రీ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మ.12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి మ.2:30 …

Read More »

నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి… ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఇడుపులపాయలో YSR జయంతికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు జగన్‌. ఉదయం 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం …

Read More »

రేపే సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణ.. భయంతో హడలెత్తిపోతున్న భక్తులు! ఎందుకంటే..

సింహాచలంలో వరుస ప్రమాదంలో భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనలో.. ఏడుగురు భక్తులు ప్రాణాల కోల్పోయిన ఘటన మరువక ముందే గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కొండ దిగువున భారీ రేకుల షెడ్డు కూలిపోవడం భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తు భక్తులెవరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెనుముప్పే తప్పింది. అయితే.. సింహాచలంలో తాత్కాలిక నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు.. విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏర్పాట్లు ముమ్మరం …

Read More »

ఇంటర్‌ పాసైన పేదింటి విద్యార్ధులకు బంపరాఫర్.. ఏడాదికి రూ.20 వేల స్కాలర్‌షిప్‌ ఛాన్స్!

పేదింటి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పోత్సహకంగా ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. ఈ పథకం కింద అండర్‌ గ్రాడ్యుయేట్లకు మొదటి 3 సంవత్సరాలకు ఒక్కో ఏడాది రూ.12 వేలు, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్‌కు రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు.. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల చదువులకు చేయూత ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద సెంట్రల్‌ సెక్టార్ …

Read More »

బ్యాంకులో దుర్గమ్మ బంగారం డిపాజిట్.. ఎన్ని కిలోలు.. విలువ ఎంతంటే..?

బెజవాడ దుర్గమకు భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో దుర్గమ్మ బంగారాన్ని అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.5 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా భక్తులకు మరో గుడ్ న్యూస్‌ను కూడా ఆలయ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకులో డిపాజిట్ …

Read More »

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని.. మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిందో భార్య. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో జులై 2న ఈ ఘటన జరగ్గా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనే వ్యక్తి జులై 2వ తేదీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో చంద్రశేఖర్‌ను హత్య చేసింది అతని భార్య రమాదేవిగా తేలింది. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడన్న …

Read More »

ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఈ కింద తెలుసుకుందాం.. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత …

Read More »

ఆపరేషన్ సింధూర్‌తో పెళ్లి వాయిదా.. ఆ ముచ్చట తీరకుండానే ఇలా..! ఆర్మీ జవాన్ కథ తెలిస్తే..

ఆపరేషన్ సిందూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్ రాజౌరీలో చనిపోయాడు. చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అవ్వడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరీలో విధుల్లో ఉండగా చేతిలో ఉన్న గన్‌ మీస్‌ఫైర్ అవ్వడంతో …

Read More »

వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. …

Read More »