ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అన్న క్యాంటీన్లు (100) ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు తొలిరోజు అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి 93 వేల మంది ఆహారం తీసుకున్నారు. వీరిలో అల్పాహారం 32,500, మధ్యాహ్న భోజనం 37,500, రాత్రి భోజనం 23,000 మంది చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువశాతం …
Read More »ఆధార్ లేని వారికి అలర్ట్.. ప్రత్యేక క్యాంపులు.. ఎప్పటి నుంచి అంటే?
మనదేశంలో ప్రస్తుతం ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వానికి చేసుకునే దరఖాస్తుల దగ్గర నుంచి సంక్షేమ పథకాల వరకూ ప్రతి అంశానికి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ట్రైన్ రిజర్వేషన్ దగ్గర నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వరకూ అన్నింటికీ ఆధారే ఆధారం. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు అందరికీ ఆధార్ కార్డులు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా …
Read More »AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
కేరళలోని వయనాడ్లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …
Read More »నేను పారిపోయే రకం కాదు.. అంత ఖర్మ నాకు లేదు..
తాను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. ఉదయం నుంచి తనపై కొన్ని మీడియా ఛానెళ్లలో, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో తాను పారిపోయేందుకు ప్రయత్నించానంటూ ప్రచారం జరుగుతోందని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. పారిపోవాల్సిన అవసరం, ఖర్మ తనకు పట్టలేదన్నారు. రెండు నెలలుగా విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తాను తప్పుచేశానని …
Read More »సీఎం బావకు బాలకృష్ణ రిక్వెస్ట్.. నెరవేరేనా?
tdp mla nandamuri balakrishna open anna canteens in hindupur:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి.. బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ అందింది. బావ చంద్రబాబు అంటే బాలయ్యకు ఎంత గౌరవమో.. అలాగే బావమరిది బాలకృష్ణ అంటే చంద్రబాబుకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ విషయంలో చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు బాలకృష్ణ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. శుక్రవారం హిందూపురంలో పర్యటించారు. రెండుచోట్ల అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించిన బాలకృష్ణ.. స్వయంగా తన …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు.. కో ఛైర్మన్గా టాటా సన్స్ ఛైర్మన్
Chadrababu Natarajan Chandrasekaran meeting: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రమఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్ఫోర్స్కు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్గా ఉంటారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా.. ప్రకటించారు. శుక్రవారం టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. మరో ఏడాది ఉచితం, ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్వోడీ, అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు.. 2025 జూన్ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. …
Read More »శ్రీకాకుళం: చిన్న చేప ముల్లు మత్స్యకారుడి ప్రాణాలు తీసింది.. ఇలా కూడా జరుగుతుందా!
చిన్న చేప ముల్లుకు ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ పోషణ కోసం పొరుగు రాష్ట్రానికి వెళితే.. ఊహించని ఘటనతో ప్రాణాలే పోయాయి.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం రూరల్ మండలం నర్సయ్యపేటకు చెందిన కొమర పోలీసు అనే మత్స్యకారుడికి రేవతి అనే మహిళతో వివాహమైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుకు స్థానికంగా ఉపాధి లేకుండా పోయింది.. దీంతో ఉపాధి కోసం తన తండ్రి అవతారంతో కలిసి గత నెల 28న కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వలస వెళ్లాడు. అక్కడ పోలీసుకు …
Read More »జనసేన పార్టీకి షాక్.. ఐదు రోజుల్లోనే మళ్లీ వాళ్లిద్దరు వైసీపీలో చేరారు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి చేరికలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్ నడుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.. వైఎస్సార్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన నేతలు.. ఐదు రోజులకే తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంల జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఈ నెల 8న ఉమ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే …
Read More »సత్తెనపల్లి: ఏడేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డులు.. అనారోగ్యం వెంటాడుతున్నా సరే, హ్యాట్సాఫ్
ఏడేళ్ల బాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా స్కూల్కు వెళుతూ అరుదైన ఘనతను దక్కించుకుంది.. సరికొత్త రికార్డుల్ని అందుకుంది. ఐదున్నర నెలలకే పుట్టి.. మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్వలి కారు డ్రైవర్ కాగా.. కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. షీబా 2017లో గర్భం దాల్చిన ఐదో నెలలోనే అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అనే పాపకు జన్మనిచ్చారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. …
Read More »