వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలందుకున్న గణపయ్యను నిమజ్జనం చేసే ముందూ ఆయన చేతిలో ఉన్న లడ్డూ, పండ్లను వేలం వేయడం జరుగుతుంది. వేలంలో పాల్గొని భక్తులు వాటిని కొనడం జరుగుతుంది. ఎక్కడైనా ఇదే పద్దతి ఉంటుంది. కానీ ఏలూరు జిల్లాలోని ఉండ్రాజవరంలో మాత్రం ఏకంగా తొమ్మిది రోజులు పూజలందుకున్న మట్టిగణప్య విగ్రహాన్నే వేలం వేస్తారు. వేలంలో విగ్రహాన్ని దక్కించుకున్న వారు. ఆ విగ్రహాన్ని తమ పొలంలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం ద్వారా పంటలు సమృద్దిగా పండుతాయని వారు నమ్ముతారు. వినాయక చవితి …
Read More »తండ్రికి తగ్గ తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణంతో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు!
తండ్రి స్పూర్తితో దేశం మెచ్చే క్రీడాకారుడిగా మన్ననలు పొందుతున్నాడు విజయనగరం జిల్లా కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో తండ్రి భారత్కు కాంస్య పథకాన్ని తెచ్చిపెడితే.. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అజయ్ స్వర్ణ పథకాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పెరుతెచ్చుకున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత …
Read More »బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాలపై వరుణుడి తాండవం
వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.? పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెలలో 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే..
తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. రోజూ వెంకన్న భక్తులతో ఏడు కొండలు నిండిపోతాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో …
Read More »రాష్ట్రంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం!
రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాట్లు చేసిన గణేష్ విగ్రహ ఊరేగింపు చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా …
Read More »ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !
అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ భూములు కావడం, యూనివర్సిటీలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వనాన్ని తలపిస్తుండటంతో పెద్ద ఎత్తున కోతుల గుంపు విశ్వవిద్యాలయంలోకి వచ్చేది. వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా…క్లాస్ రూమ్స్ తోపాటు హాస్టల్స్ గదుల్లోకి చొరబడేవి. అందిన వాటినల్లా పాడు చేసేవి. దీంతో కోతుల భయం విద్యార్ధులు, అధ్యాపకులను వెంటాడేది. కోతుల బెడద తొలగించుకోవడానికి యూనివర్సిటీ పాలక వర్గం చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అవేవి …
Read More »ఆ ప్రాజెక్టు అత్యంత కీలకం.. తెలంగాణ నాయకులు అర్ధం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం అంటూ పేర్కొన్నారు. పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం …
Read More »ఏపీలోని ఓ సాధారణ గ్రామంలో గణపతి లడ్డూ వేలం.. లక్షల్లో పలికిన ధర
ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో వినాయక మండపం వద్ద జరిగిన వేలం పాటలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. శుక్రవారం నిమజ్జనానికి ముందు లడ్డూ, కలశం కోసం ప్రత్యేకంగా వేలం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్రెడ్డి లడ్డూను భారీ ధరకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పండగ రోజున గణపతిని ఆరాధించిన తర్వాత, కొన్ని రోజులు గడిచాక నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయి. ఈ సందర్భంలో వినాయకుడి ప్రసాదంగా ఉంచిన లడ్డూలకు జరిగే వేలంపాటలు ప్రత్యేక …
Read More »కరెన్సీ నోట్ల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న వినాయకుడు.. ఎన్ని కోట్లను ఉపయోగించారంటే..
మంగళగిరి ప్రధాన వీధిలోని మండపంలో గణపతిని నోట్ల తో అందంగా అలంకరించారు. వ్యాపారులు తమ వద్ద నున్న నోట్లను ఇచ్చి కొత్త నోట్లను ముందుగానే తెచ్చుకుంటారు. నూతన కరెన్సీని మాత్రమే స్వామి వారి అలంకరణకు ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని ఎవరికి వారికి ఇస్తారు. సంకా బాలాజీ గుప్తా ప్రతి ఏటా ఈ అలంకరణను పర్యవేక్షిస్తారు. స్థానిక వ్యాపారులంతా సహకరిస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం మంగళగిరిలోని వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ప్రతి ఏటా ప్రధాన వీధిలోని ఏర్పాటు చేస్తున్న విగ్రహం …
Read More »మండపాల్లో వివిధ రూపాల్లో గణపయ్య.. ఆకట్టుకున్న ఆపరేషన్ సిందూర్, ఆపిల్, టెంకాయ గణేశ విగ్రహాలు..
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. …
Read More »