ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్.. అందుబాటులోకి క్యారవ్యాన్‌ సర్వీస్‌!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చూన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన టూరిజం కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన టూరిజం క్యారవాన్‌ను ప్రారంభించారు.ఆంద్రప్రదేశ్ లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో నూతన క్యారవ్యాన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెడతామని, గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే అరసవెల్లి సూర్య దేవాలయం.. చరిత్ర తెలుసా.?

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్‎ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో  ఈ ఆలయన్ని నిర్మించారు. మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.  ఇక్కడి మూలవిరాట్‎ను స్వయ౦గా దేవే౦ద్రుడు ప్రతిష్టించారని చెబుతారు. అయితే ‘పద్మపురాణ౦’ …

Read More »

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. నైరుతికి అల్పపీడనం తోడై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని.. దీంతో మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోందని.. …

Read More »

రైతులకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్.. ఆ రోజే ఖాతాల్లోకి డబ్బులు!

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో మరో హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు రోజుల్లో అన్నదాత సుఖీభవ హామీకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. పాలనలో తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …

Read More »

గుడివాడ వచ్చిన కొడాలి నాని – ఛాతికి ఆ బెల్డ్ ఎందుకు ధరించారో తెల్సా..?

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు చెందిన దుకాణంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊరట లభించింది. ఆయనకు గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఛాతీకి బెల్టుతో కోర్టుకు వచ్చిన నాని.. బెయిల్ పత్రాలు సమర్పించారు. కొడాలి నానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది కోర్టు. మంగళవారం, శనివారం గుడివాడ పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. …

Read More »

రూ.కోటికి.. రెండు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..దిమ్మతిరిగే ట్విస్ట్!

రద్దయిన రూ.2వేల నోట్లతో రెట్టింపు డబ్బును ఆశగా చూపి ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఓ వ్యాపారి నుంచి రూ.కోటి కాజేసి అడ్డంగా దొరికి పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73.20 లక్షల నగదు తోపాటు రెండు వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసిందిచలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి …

Read More »

 డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్‌, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో …

Read More »

హైకోర్టులో జగన్‌కు ఊరట.. విచారణ వాయిదా.. తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన కోర్టు..!

గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు. సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు …

Read More »

ఛార్జింగ్ ఎక్కుతుండగా పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌.. మహిళ మృతి

కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎలక్ట్రిక్‌ స్కూటీకి ఛార్జింగ్‌కు పెట్టగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో అక్కడే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట లక్ష్మమ్మ ఇంటి ప్రాంగణంలో తన కుటుంబం కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటీ రాత్రి ఛార్జింగ్‌ కోసం ఉంచారు. అయితే.. ప్రమాదకరంగా వాహనం పేలడంతో సమీపంలో ఉన్న ఆమెకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రతపై ఆందోళనలకు దారితీసింది. వీటిని సరైన …

Read More »

చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణీకుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన సంఘటన గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. …

Read More »