ఆంధ్రప్రదేశ్

నకిలీ ప్రొఫైల్స్.. నిజమైన నష్టాలు..! వాట్సాప్ డీపీ తో 5 లక్షలు స్వాహా..

సాధారణంగా స్నేహితులంటే అమితమైన ప్రేమ ఉన్నవారు అడగంగానే ఏదైనా చేసేస్తారు. అందులో భాగంగానే పాపం ఈ స్నేహితుడు తన స్నేహితుడి ఫోటో ఉన్న వాట్సాప్ నుంచి డబ్బులు అవసరం అంటూ మెసేజ్ రావడంతోనే 500000 పంపేశాడు. తీరా అది స్నేహితుడు కాదని తెలుసుకుని అవాక్కయ్యాడు.. వినటానికి మరి విడ్డూరంగా ఉన్న.. నిజమైన ప్రేమ గుడ్డిది అన్నట్లుమోసపోయేవారు ఉంటే మోసం చేసేవారికి హద్దే లేదు… ఈ మధ్యకాలంలో మోసపోయిన తర్వాత గాని ఇలా కూడా మోసం చేస్తారా అనేలా ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న మోసాలు …

Read More »

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..

వ్యసనాలకు బానిసయ్యారు.. తండ్రి డబ్బులు కోసం కుస్తీ పడ్డారు. ఒకరిపై మరొకరికి అనుమానం పెరిగిపోయింది. దీంతో ఆస్తిని దక్కించుకునే క్రమంలో అన్నదమ్ముల్నే ఏకంగా హత్య చేసింది ఒక సోదరి… ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది.మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. మారిపోతున్న మానవీయ విలువల గురించి ఈ పాటను మనం తరచూ గుర్తుచేసుకుంటుంటాం.. నిజంగా.. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ఆధునిక కాలంలో మనుషులంతా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసే వారు.. …

Read More »

ఆత్మలపై రుణాలు.. ఇదేంటని రికవరీ ఏజెంట్లు ఇంటికి వెళ్లగా.. బయటపడ్డ విస్తుపోయే నిజాలు

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాగే జరిగింది ఓ ఫైనాన్స్ కంపెనీలో.. అదునుగా భావించిన ఓ ఘరానా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీనే బురిడీ కొట్టించాడు. లోన్‌ల పేరిట ఏకంగా ఆరు కోట్లకు టోకరా పెట్టేసి పరారయ్యాడు.అలా‌ ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద హౌస్ లోన్లు తీసుకొని.. వాటికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇటు‌ పని చేస్తున్న సంస్థను అటు నమ్మిన స్నేహితులను ఆ ఘనుడు నట్టెట్ట ముంచేశాడ. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా …

Read More »

అతుల్ ఆత్మహత్య.. తెరపైకి కొత్త డిమాండ్.. ఆ చట్టం తేవాలని..

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆత్మహత్య చేసుకునే ముందు 40 పేజీల లేఖ రాసి.. మరో 80 నిమిషాల వీడియో తీసి.. తాను ఏ విధంగా వేధింపులకు గురవుతున్నానని విషయాన్ని ప్రస్తావించడం… …

Read More »

అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి..

స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్‌ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు.. …

Read More »

రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..

అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది. ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా …

Read More »

మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు.

ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది. లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.. ఈ స్టోర్ల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయిల కాగా.. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయిలుగా నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్సు రుసుము 10శాతం చొప్పున పెరుగుతుంది. ప్రీమియం షాపుల లైసెన్సుదారులకు ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్‌ చెల్లిస్తారు. ఈ ప్రీమియం …

Read More »

పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని …

Read More »

ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి

ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను …

Read More »

రెచ్చిపోతున్న ర్యాప్ ముఠాలు.. లక్షల రూపాయల కొల్లగొడుతున్న మాయగాళ్లు..!

బాపట్ల పరిసర ప్రాంతాల్లో ర్యాప్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. పోలీసులు ఉక్కు పాదం మోపుతున్న అడపా దడపా ర్యాప్ గ్యాంగ్‌ల ఆగడాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ముప్పై మూడు లక్షల రూపాయలను అత్యంత్య తెలివిగా ర్యాప్ గ్యాంగ్ కొట్టేసింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాప్ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కల్యాణ్ చక్రవర్తి హోల్ సేల్ దుకాణం నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతనికి నర్సరావుపేటకు …

Read More »