ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వేసవి సెలవులు ముగిసి ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ. మరి ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి? అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర …
Read More »ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్చాట్ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్రానికి సంబంధించిన …
Read More »చిరుధాన్యాల్లో మోదీ యోగాసనాలు.. కళా రూపానికి జీవం.. చూస్తే ఔరా అనాల్సిందే..!
యోగాను విశ్వవ్యాప్తం చేసి.. ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు యోగాను జీవితంలో భాగం చేసి విశాఖ వేదికగా మరో రికార్డు సృష్టించబోతున్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.. విశాఖకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రధాని మోదీ మెచ్చిన యోగాతో పాటు.. ప్రధాని నచ్చిన ఆహారమైన చిరుధాన్యాలతో చిత్ర పటాలను వేశాడు. అదీ కూడా మోదీ యోగాసనాలతో అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించాడు. కలర్స్తో …
Read More »వైజాగ్కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖ ఐటీ హబ్ను బలోపేతం చేయడానికి రూ. 1500 కోట్ల పెట్టుబడితో మెగా టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకుగానూ సదరు కంపెనీకి 22 ఎకరాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీగా ఎకరానికి 99 పైసలు మాత్రమే తీసుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.విశాఖ నగరం ఐటీ రంగంలో మరో మెట్టు ఎక్కనుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖను తన …
Read More »శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ – అక్కడ ప్రయాణం పూర్తి ఉచితం
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల అరికట్టడం, కాలుష్య నియంత్రణకు ఉచిత బస్సులు చారిత్రకమని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులు శ్రీవారి ధర్మ రథాల మార్గంలో ప్రతి రెండు నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ద్వారా తిరుమలలో భక్తుల రవాణా మరింత సౌకర్యవంతం కానుంది.తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అదనపు …
Read More »కృష్ణమ్మ ఒడ్డున జల యోగాసనాలు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు!
యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో 188 మందితో జల యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగా శిక్షకులు రెబ్బా పోతన శాస్త్రి సూచనలతో నీటిపై తేలియాడుతూ ప్లవని ప్రక్రియతో వృక్షాసనం, శవాసనం, పద్మాసనం, వాయుదిగ్బంధనం తదితర ఆసనాలతో విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచారు. అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ (అవారా) ఆధ్వర్యంలో రింగ్ సాయంతో చిన్నారుల ఆసనాలు, నాగాయలంక ఈత మిత్రులు, బావదేవరపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఊపిరిని నియంత్రిస్తూ నీటిలో వివిధ …
Read More »కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్, జగన్ కలిసే ఆ ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్ను, తన భర్త ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …
Read More »శ్రీవారికి భక్తులు సమర్పించిన మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ లో వేలం.. ఎప్పుడంటే..
కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని రకరకాల కోరికలు కోరుకుంటారు. ఆపదల మొక్కుల వాడు తమ కోర్కెని తీర్చిన తర్వాత బూరి విరాళాలను, కానుకలను సమర్పించుకుంటారు. ఇలా కానుకలుగా బంగరం వెండి వస్తువులు, నగదు, భూమి వంటి వాటితో పాటు ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రికల్ వస్తువులను కూడా సమర్పిస్తున్నారు. శ్రీవారికి కానుకలుగా వచ్చిన మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుమల తిరుపతిలో ఉన్న ఇతర అనుబంధ …
Read More »టోనీ బ్లెయిర్తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష
బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …
Read More »జగన్ రెంటపాళ్ల పర్యటనపై పొలిటికల్ రచ్చ.. ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది..?
వందమందే రావాలన్నారు.. కానీ వందలాది మందొచ్చారు..! ఆంక్షలున్నాయ్ అదుపులో ఉండాలన్నారు.. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్… అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్ పర్యటనపై పొలిటికల్ ఫైట్ నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. శాంతిభద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే.. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరీ టూర్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండబోతోంది..? నమోదుకాబోయే కేసులెన్ని..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం..! వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపుచేయలేని …
Read More »