సీఎం చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా రెండు నెలల్లో వ్యర్థాల నిర్వహణపై తుది పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుచేయాలని నిర్ణయించారు.సర్క్యూలర్ ఎకానమీ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ఠ పరిచేలా రెండు నెలల్లో తుది పాలసీ రూపొందించాలని, వెంటనే అమలులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతి సచివాలయంలో …
Read More »ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే.. 1:2 నిష్పత్తిలో ఎంపిక!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఏపీపీఎస్సీ …
Read More »నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్..
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …
Read More »మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్.. నేడు కోర్టు ముందు హాజరు!
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం (జూన్ 17) అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు.. వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం (జూన్ 17) అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ …
Read More »వీఆర్వో ఇంట్లో నకిలీ రెవెన్యూ రికార్డులు తయారీ.. పోలీసుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు!
అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. రెవెన్యూ ఆఫీస్లోని అధికారులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ నకిలీ పత్రాలు బయటపడ్డాయి.రెవెన్యూ శాఖలో అడ్డగోలుకు అడ్డువాకు ఉండదు. క్రింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఏదో ఒక పంచాయతీలో …
Read More »పంచారామ క్షేత్రాలు ఏంటి.? వాటి నిర్మాణ చరిత్ర ఇదే..
పంచా క్షేత్రాలు లేదా పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన ఐదు పురాతన హిందూ దేవాలయాల సమూహం. ఈ ఆలయాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం.. ఈ ఆలయాలలోని లింగాలను, అరమాలుగా సూచిస్తారు. ఒకే ఏకీకృత శివలింగం నుండి సృష్టించబడ్డాయని నమ్ముతారు. పంచారామ ఆలయాల స్థాపనను ఇంద్రుడు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మరి వీటి స్టోరీ ఏంటి.? ఈరోజు చూద్దాం.. అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని శిలాశాసనం, చారిత్రక ఆధారాల ఆధారంగా, దాని గోడలపై ఉన్న 35 …
Read More »శ్రీవారి భక్తులకు అలర్ట్..! తిరుమలలో దర్శనం, వసతి, శ్రీవారి సేవ సెప్టెంబర్ కోటా విడుదల..!
తిరుమల భక్తులకు టీటీడీ గొప్ప ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే టీటీడీ సెప్టెంబర్ నెల దర్శనం.. గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల …
Read More »పాలకొల్లులో ఆవుల కోసం గరుకు స్తంభాల ఏర్పాటు.. ఈ గరుకు స్తంభం విశిష్టత ఏమిటంటే..
మనిషికి దురద పుడితే ఏం చేస్తారు చేతితో గోకుతారు. వీపు భాగం లో ఐతే పుల్ల తోనో మరేదైనా వస్తువునో ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు సైతం మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. మరి ఇదే కష్టం ఒక నోరులేని జీవికి వస్తే అది యెంత వేదనకు గురి అవుతుంది. సాధ్యమైనంత వరకు తనకు తాను శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆవుకి ఉండే గంగ డోలుకి దురద కలిగితే.. తీర్చుకునేందుకు గరుకు స్థంభాలను ఏర్పాటు …
Read More »అడ్డొస్తే తొక్కేస్తారా.. ఎవర్ని తొక్కుతారు? ఇక్కడుంది CBN..! సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ను “నాటకాల రాయుడు” అని పిలుస్తూ, ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పొదిలి టూర్ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో …
Read More »యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఆర్కె బీచ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు జరుగుతున్న యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణతో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3లక్షల 40వేల మందితో ఒకే ప్రాంతంలో యోగా నిర్వహించిన 22 ఐటమ్స్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. …
Read More »