నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …
Read More »Free Gas Cylinders Scheme: దీపం 2 పథకానికి భారీ రెస్పాన్స్.. ఎంతమందికి డబ్బులు జమ చేశారంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అపూర్వమైన స్పందన వస్తోంది. ఈ పథకం ప్రారంభించి 42 రోజులు కాగా.. ఈ 42 రోజుల్లో 80 లక్షలకు పైగా సిలిండర్ బుకింగ్స్ జరిగాయి. ఇందులో 62 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. వీరిలో 97 శాతం మందికి నగదును బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి ఉచిత గ్యా్స్ సిలిండర్ బుకింగ్ కోసం 2025 మార్చి 31 వరకూ అవకాశం ఉంది. నాలుగు …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతంలో నున్న నిన్నటి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది.. దీంతోపాటు అనుబంధి ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉంది.. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే …
Read More »ఏపీకి త్వరలో కొత్త డీజీపీ..! రేసులో ఎవరెవరు ఉన్నారంటే..
ఆంధ్రప్రదేశ్కు కొత్త డీజీపీ వచ్చే అవకావం ముమ్మరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి ముగియనుంది. అయితే ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనే దానిపేఐ క్లారిటీ లేదు. ఒకవేళ రిటైర్ మెంట్ తీసుకుంటే తర్వాత ఆ పోస్టులో ఎవరుంటారనే దానిపై చర్చసాగుతుంది..కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం …
Read More »5 నెలల వ్యాలిడిటీ, 320GB డేటాతో బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్!
ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది కస్టమర్లు తమ నంబర్లను ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ చాలా చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందజేయడమే దీనికి కారణం. ఈ సిరీస్లో బీఎస్ఎన్ఎల్ 5 నెలల చెల్లుబాటుతో కొత్త, చాలా చౌక రీఛార్జ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఈ ప్లాన్ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్ రూ.997 …
Read More »ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
ఆమె పేరు రమాదేవి.. సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి …
Read More »స్కానింగ్ సెంటర్ నుంచి కేకలు వేస్తూ బయటకు వచ్చిన యువతి.. ఆరా తీయగా
ఆమెకు యాక్సిడెంట్ కారణంగా గాయాలు అయితే వైద్యుడి వద్దకు వెళ్లింది. అక్కడ స్కాన్కు రిఫర్ చేశారు. స్కానింగ్ కోసం సెంటర్కు వెళ్లగా.. ఆమెకు భయానక అనుభవం ఎదరయ్యింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…విశాఖలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ కీచక బుద్ధి బయటపెట్టాడు. డాక్టర్ రిఫర్ చేసిన ఓ యువతి స్కానింగ్కు కోసం రావడంతో.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. అప్రమత్తమైన ఆమె బంధువులు.. …
Read More »ఇక ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ షురూ.. ఏఐ, డీప్ టెక్లతో పౌర సేవలు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వ్యవహారాల్లో భాగం చేసేందుకు సిద్ధమైంది. ఏఐ, డీప్టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకురానుంది..అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకే చెందిన వార్త ఇది. ఏఐ, డీప్టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వాట్సాప్ ద్వారా పౌర సేవలు వేగంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా …
Read More »తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్పై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది.తిరుమలలో ఇటీవల తరచూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం సమీపంలో కొందరు చేస్తున్న హడావిడితో చాలామంది భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ నిబంధనల్ని పట్టించుకోకుండా ఫోటో షూట్లు చేస్తున్న ఘటనలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో.. తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్పై టీటీడీ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. …
Read More »భక్తులకు శుభవార్త.. స్పర్శ దర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు …
Read More »