ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ టూర్ ఖరారైంది. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనుంది. అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు …
Read More »ఉదయగిరిలో దారుణ హత్య.. పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికి చంపారు!
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కొండాపురం మండలం గరిమినపెంటకు చెందిన హమీద్పై ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వాటాదారులు ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో హమీద్, హనీఫ్, ఉమర్ అనే ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్ను ఉమ్మడి భాగస్వామ్యంగా నిర్వహించేవారు. అయితే ఇటీవల ఈ …
Read More »వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యాపాారి బలి.. సంచలనంగా మారిన ఆడియో రికార్డ్..
వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు …
Read More »యానాం గోదావరిలో తొలి పులస దొరికేసిందోచ్.. కేజీకి ఎంత పలికిందో తెలిస్తే స్టన్.!
యానాం గోదావరిలో మత్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను వేలంలో 15 వేల రూపాయలకు మత్స్యకార మహిళ పోన్నమండ రత్నం దక్కించుకుంది. స్థానిక మార్కెట్లో ఈ పులసను 18 వేల రూపాయలకు మత్యకార మహిళ రత్నం విక్రయించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయి. గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఎదురీదుతూ వెళ్లడం వల్ల పులస చేప అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు …
Read More »ఇప్పట్లో వానల్లేవ్.. ఆ జిల్లాలకు మాత్రం వరద ముప్పు! హెచ్చరికలు జారీ చేసిన సర్కార్..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు. అరకోర జల్లులు మినహా భారీ వానలకు అనుకూల వాతావరణం కానరావడం లేదు. మరోవైపు ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి జార్ఖండ్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు …
Read More »ఇవాళ సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఉత్కంఠ రేపుతున్న విచారణ
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పటికే ఏప్రిల్ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. స్కామ్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డేనని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తునకు ఊతమిచ్చాయి. అంతే స్పీడుతో… ఏపీలో రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణానికి 2019 ఆగస్టు నెలలో విత్తనం పడింది. వైసీపీ పవర్లోకి వచ్చిన మూడునెలల్లోనే లిక్కర్ పాలసీని సమూలంగా మార్చి, ప్రభుత్వ ఆధ్యర్యంలోనే మద్యం అమ్మకాలు జరిపేలా 3 …
Read More »పదో తరగతి పబ్లిక్ పరీక్షల క్వశ్చన్ పేపర్ మారుతుందోచ్.. కొత్త మార్పులు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రంలో పలు మార్పులు చోటు చేసుకోకున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లోని సృజనాత్మకత పరిశీలించేలా ప్రశ్నాపత్రంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సీబీఎస్ఈ బోర్డుతో పోల్చితే రాష్ట్ర బోర్డుల్లో ఉత్తీర్ణత తక్కువగా నమోదు అవుతోంది. దీనిపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పదో తరగతి ఫలితాల్లో గణనీయంగా ఫెయిలౌతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నట్లు …
Read More »TDP vs YSRCP: అసలీ ప్రైవేట్ కేసులు అంటే ఏంటి…? వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది…?
మాజీ సీఎం జగన్ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏరేంజ్లో అయితే నడుస్తోందో… కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి…! అంతకుముందు గుంటూరు, మొన్నామధ్య పల్నాడు, లేటెస్ట్గా బంగారుపాళ్యం పర్యటనపైనా కేసులు ఫైల్ అవ్వడం చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం… ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతారా…! విచ్చలవిడిగా కేసులు పెడతారా…! మీరు మాపై కేసు మీద కేసు రాస్తే… మేం తప్పక ఇస్తాం రివర్స్ డోసు అంటున్నారు వైసీపీ నేతలు. చట్టబద్ధంకాని కేసులను చట్టబద్ధంగానే తేల్చుకుంటామంటూ సవాల్ చేస్తున్నారు. ప్రైవేట్ కేసులు …
Read More »మా నాన్న ఏరోజు రాలేదు.. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో కేంద్రమంత్రి భావోద్వేగం!
స్కూల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఉంటే ఎవరు వెళ్తారు.. పిల్లలు చదివే స్కూల్కు తల్లిదండ్రులు వెళ్తారు. కానీ ఇక్కడో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా తన తల్లిదండ్రులు చదువకున్న స్కూల్కు వెళ్లారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని, తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టిన మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్లో భాగంగా గురువారం తమ పిల్లలు చదువుకునే స్కూల్స్కి తల్లిదండ్రులు వెళ్తే. కేంద్ర పౌర …
Read More »శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల డేట్ వచ్చేసింది.. బ్రేక్ దర్శనాల సహా పలు దర్శనాలు రద్దు.. గరుడ వాహన సేవ ఎప్పుడంటే..
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అప్పుడే సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత సమయంలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ ఉన్నతాధికారుల తో జరిపిన సమీక్ష దిశా నిర్దేశం చేశారు. తిరుమలలోని అన్నమయ్య …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal