పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కావచ్చు.. కానీ అందుకు కారణం.. గంగమ్మ జాతర! పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే.. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర..! తాజాగా ఐకాన్ స్టార్ తాజా గెటప్తో.. వాల్డ్ ఫేమస్ అయింది తిరుపతి గంగమ్మ జాతర! అవును..పుష్ప- 2 స్టోరీ లైన్ ఏదైనా కానివ్వండి..! కానీ సినిమాను ఊపేసింది మాత్రం..గంగమ్మ జాతర సన్నివేశాలు! మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్! శక్తి …
Read More »వడ్డీ రేట్లు యధాతథం.. రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్బీఐ, రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి.దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా …
Read More »పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!
అన్నోన్ కాల్ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్ పడేదాకా టార్చర్ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్తో జనాన్ని ట్రాప్ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్ క్రిమినల్స్. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …
Read More »ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గరి నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో …
Read More »ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్ఆర్)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి …
Read More »ఏపీ మద్యం షాపుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు.. రూ.5 లక్షల ఎఫెక్ట్, ఆసక్తికర కారణం
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. లాటరీ ద్వారా కేటాయించిన షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మద్యం ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ప్రస్తుతం ప్రతి వైన్ షాప్ వద్ద ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. అలాగే.. MRP ధరలకే మద్యం అమ్మబడును.. అని కూడా బ్యానర్లు కడుతున్నారు. మద్యం బ్రాండ్, ఎంత ఎంఎల్ ఎంత ధరకు లభిస్తుంది వంటి వివరాలతో బ్యానర్లు పెడుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి వైన్ షాప్ …
Read More »బాబోయ్ మళ్లీనా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఈ ప్రాంతాల్లో జోరు వానలు
దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్ తుపాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ మేరక శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో …
Read More »పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ప్రయోగం సక్సెస్.. సూర్యకిరణాలపై అధ్యయనం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన PSLV- C 59 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఉపగ్రహం. ప్రోబా 3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 సూర్యకిరణాలపై అధ్యయనం చేయనుంది. ప్రోబా 3లో రెండు ఉపగ్రహాలున్నాయి. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్ స్పేస్, 240 కేజీల బరువున్న ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ రాకెట్లో ఉన్నాయి. ఈ జంట ఉపగ్రహాలు …
Read More »శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 …
Read More »హైదరాబాద్లో అతిపెద్ద సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ
తెలుగు రాష్ట్రాలతో గూగుల్ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ.. ఈ గూగుల్ సేఫ్టీ సెంటర్ ఉపయోగాలేంటి?.. ఏపీలో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతోంది?…ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు …
Read More »