ఆంధ్రప్రదేశ్

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు..!

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు మేలు చేసే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని సూచించారు. ఫ్యామిలీ …

Read More »

వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. ఇవగో పూర్తి డీటేల్స్..

తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గమార్చారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కరీంనగర్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, కాచిగూడ–మెదక్‌, మెదక్‌–కాచిగూడ, బోధన్‌–కాచిగూడ, ఆదిలాబాద్‌–తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నిజామాబాద్‌–కాచిగూడ రైలు రద్దు కానుంది. మహబూబ్‌నగర్‌–కాచిగూడ, షాద్‌నగర్‌–కాచిగూడ రైళ్లను కొంత దూరం వరకే నడిపి పాక్షికంగా రద్దు చేశారు. కామారెడ్డి–బికనూర్‌–తలమడ్ల, అకన్పేట్‌–మెదక్‌ మధ్య రైల్వే …

Read More »

చోరీ కేసును విచారిస్తుండగా ఊహించని ట్విస్ట్.. ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమే..

తునిలో వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఈ చోరీ వెనక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. అమ్మాయిగా మారాలని ఆకాంక్షించిన సతీష్‌ (అవంతిక రెడ్డి) తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్‌ సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకోవడానికే ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు వెనుక ఒక ఊహించని స్టోరీ బయటపడింది. ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్న ఆరాటమే ఈ క్రైమ్‌కు కారణమని పోలీసులు తేల్చారు. ఆగస్టు 20న తుని …

Read More »

రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం మామూలుగా లేదు.. గ్యాప్‌ లేకుండా దంచికొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడమే కాదు.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్‌లు తెగిపోవడం.. వరదలకు కార్లు కొట్టుకుపోవడం.. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరుణ బీభత్సం కంటిన్యూ అవుతోంది. అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. ఇటు గుంటూరు, పల్నాడు, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వాన వణికిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో …

Read More »

భక్తులను ముగ్ధులను చేస్తున్న ఈఫిల్ టవర్ వినాయక మండపం.. ఎక్కడో తెలుసా?

వినాయకచవితి వచ్చిందటే చాలు వీధివీధినా రకరకాల గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతి వీధిలో విభిన్న రకాల వినాయకులు కనువిందు చేస్తాయి. విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మండపాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలు జనాలను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అయితే విజయనగరం జిల్లాలో నిర్మించిన డెబ్బై అడుగుల ఎత్తున ఈఫిల్ టవర్ వినాయక మండపం కూడా ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని పొనుగుటివలస గ్రామం వినాయకచవితి ఉత్సవాలకు ప్రసిద్ధి. ఈ గ్రామస్తులు నిర్వహించే వినాయకచవితి ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ …

Read More »

దశాబ్దాలుగా వినాయచవితి పండగకు ఆ ఊరు దూరం.. కారణం ఏంటో తెలుసా?

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందుకు ఒక గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట. ఈ గ్రామంలో ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషం. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు. తాత, ముత్తాతల నుంచి బసంపల్లిలో వినాయక …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు

ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ ప్రిసన్స్‌ అండ్ కరెక్షనల్ సర్వీస్‌.. మంగళగిరి, కడప, నెల్లూరు జిల్లాల్లోని జైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 14 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇవే.. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌ పోస్టుల సంఖ్య: 2 అకౌంటెంట్‌ కమ్‌ క్లర్క్‌ పోస్టుల సంఖ్య: …

Read More »

లేడి డాన్ అరుణ పెద్ద కి’లేడీ’.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న సెటిల్మెంట్ దందాలు చూస్తుంటే ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులు సన్నిహితంగా ఉంటున్న విషయాలు బయట పడుతున్నాయి. దీంతో గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ మొదలైందట. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు బయట ఉన్న అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించిన …

Read More »

వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులంటే?

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 185 వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్ర …

Read More »

విశాఖలో ఘనంగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్ వార్షిక సమావేశం!

వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ మహిళా ఫోరమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSTL డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్‌ను ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »