ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ)లో మరోసారి ఉద్యోగుల్ని తొలగించారు. గత ప్రభుత్వం (2019-2024) మధ్య పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ విధానంలో సిఫార్సులతో చేరిన మరో 90 మందిని తొలగిస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. అప్పటి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పలువురు ప్రజా ప్రతినిధు సిఫార్సులతో వందల మంది ఉద్యోగులు చేరారు. 2019లో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మందిని ఔట్ …

Read More »

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి దిగుమతి అయిన వెల్లుల్లిని అక్రమంగా తరలిస్తుండగా.. పట్టుకున్నారు. అయితే ఈ చైనా వెల్లుల్లిని కేంద్ర ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే నిషేధించడం గమనార్హం. చైనాలో వెల్లుల్లిని అపరిశుభ్రమైన వాతావరణంలో పండిస్తారని.. దాన్ని తినడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం అని ఇప్పటికే ఎంతో మంది తేల్చారు. అయినా ఇప్పటికీ దేశంలోకి చైనా వెల్లుల్లి అక్రమంగా వస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. చైనా నుంచి …

Read More »

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుండగా.. పీఏసీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పెద్దిరెడ్డి వెంట పలువరు ఎమ్మెల్సీలు కూడా తరలి వచ్చారు. పీఏసీ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం …

Read More »

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్వస్తి పలికింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల …

Read More »

మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్

గుంటూరు మేయర్, వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహర్‌నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్‌ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. …

Read More »

ఆ రెండు ఖరీదైన BMW కార్లు ఎక్కడ.. ఆరా తీసిన పవన్ కళ్యాణ్, అధికారుల సమాధానం ఏంటో తెలిస్తే!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా.. అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం.. ఎవరి దగ్గర ఉంది.. …

Read More »

HYD-విజయవాడ నేషనల్ హైవే విస్తరణ.. NHAI అధికారులకు మంత్రి కీలక ఆదేశం

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రహదారిపై ప్రతి నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒకటి. అయితే ఈ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉండగా.. వాహనాల రద్దీ కారణంగా ప్రతినిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రహదారి విస్తరణకు కేంద్రం డిసైడ్ అయింది. ఆరు వరుసలుగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీన్ …

Read More »

YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరిపై అయినా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాలలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ విబేధాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తల్లీ, …

Read More »

వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి విరాంజనేయస్వామి, మండలిలో ప్రతిపక్ష నేత …

Read More »

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు అలర్ట్.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. అంతర్రాష్ట్ర బదిలీల అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని.. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీకి రెఫర్‌ చేసి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బదిలీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు వెళ్లాలనుకునే ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల …

Read More »