ఆంధ్రప్రదేశ్

10వ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షా ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది..

ఏపీ స్టేట్ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇది విద్యార్థుల జీవితాల్లో మలుపు తిప్పే రోజు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్లు, వాట్సాప్‌లో మన మిత్ర అనే సదుపాయం, అలాగే లీప్ యాప్ ద్వారా …

Read More »

రెయిన్ అలెర్ట్..! వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు …

Read More »

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. బీజేపీలో చేరేందుకు మంతనాలు..!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ విశ్వసనీయ సమాచారం అందుతోంది. బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే మంతనాలు కూడా జరుగుతున్నాయి. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు కాకుండా మరో పదవిపై విజయసాయిరెడ్డి దృష్టి పెట్టారు. ఏపీ రాజ్యసభ రేసులో లేనని ఇప్పటికే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.. విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు ఆయన …

Read More »

రండి పిల్లలూ రండి.. ప్రభుత్వ బడిలో చేరండి ..నేటి నుంచి ఏపీలో స్కూల్ ప్రమోషన్

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉన్నా మంచి విద్యను భోదిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అందించేది అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠాలల మనుగడ కూడా కష్టంగా మారింది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లో స్టూడెంట్స్ కు కల్పించే సదుపాయాలను.. చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాడు. ఏజెన్సీ లో బైక్ కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు.. అంతేకాదు వాట్సాప్ …

Read More »

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ విజన్- 2047లో అలిపిరి బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. భక్తుల రద్దీకి తగట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పాలని చూస్తోంది. శేషాచలంలో పర్యావరణ పరిరక్షణ కోసం కసరత్తు చేస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ కు ప్లాన్ చేస్తోంది..ఆపద మొక్కుల వాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత …

Read More »

మెగా డీఎస్సీ రాత పరీక్షలో నార్మలైజేషన్‌ అమలు.. దీనితో లాభమా? నష్టమా?

What is Normalization? రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మరో బాంబ్ విద్యాశాఖ పేల్చింది. అదేంటంటే.. డీఎస్సీ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నార్మలైజేషన్‌ అమలు చేయనున్నట్లు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక …

Read More »

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల …

Read More »

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో పాటు పొరపాటున జరిగితే క్షణాల్లో నిందితులను పట్టుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీతో విజయనగరం టూ టౌన్ పోలీసులు చేపట్టిన విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీస్ స్టేషన్లకి రోల్ మోడల్ గా మారింది. ఇదే విధానాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు ఆయా జిల్లాల పోలీస్ బాసులు.ఇటీవల కాలంలో …

Read More »

విశాఖ జీవీఎంసీ పీఠం కైవసం చేసుకున్న కూటమి..

విశాఖ మేయర్‌ పీఠాన్ని కూటమి పార్టీ కైవసం చేసుకుంది.  అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన 74మంది ఓటేశారు. కోరమ్‌ సరిపోవడంతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మేయర్‌ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. అయితే.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా.. రేపు కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు. విశాఖ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్‌ నిర్వహించారు అధికారులు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో.. ఎమ్మెల్యే వంశీ కృష్ణ రాజీనామాతో 21వ డివిజన్‌ స్థానం …

Read More »