కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల …
Read More »అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్చేస్తే..
తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు …
Read More »కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు
అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. …
Read More »నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్ఆర్బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?
రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో ముగియనుంది. తాజాగా ఈ తుది గడువును రైల్వేబోర్డు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన మేరకు ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు.. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీలగా ఉన్న టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-3 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు జులై 28వ తేదీతో …
Read More »ఏపీలో మళ్లీ ‘కాల్’నాగుల బుసలు
ఏపీలో మళ్లీ కాలనాగులు బుసలు కొడుతున్నాయి. ధర్మవరంలో కాల్మనీ గ్యాంగ్ రెచ్చిపోయింది. వారానికి 10 రూపాయల వడ్డీ కట్టాలంటూ ఓ కుటుంబంపై దారుణంగా దాడి చేసింది. తీసుకున్న అప్పుకు మూడింతలు చెల్లించినా, ఇంకా ఇవ్వాలంటూ, రమణ కుటుంబాన్ని వేధిస్తోంది. ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ …
Read More »ఐబొమ్మకు మూడిందా..? రంగంలోకి పవన్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా ‘హరి హర వీరమల్లు’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలై మూడురోజుల్లా కాకముందే Ibomma, Movierulz లాంటి వెబ్సైట్లలో లీక్ కావడంతో తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. …
Read More »శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు… వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు
స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రపంచంలోని హిందువులందరికీ స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణించారు. భక్తులు సమర్పించే కానుకలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రధానంగా ఖర్చు చేయాలని వెంకయ్య సూచించారు. ఆలయ నిధుల విషయంలో ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోకూడదన్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దని సూచనలు చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి. గుడి, బడి లేని ఊరు ఉండకూడదన్నారు …
Read More »ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఇదిగో.. వచ్చే 3 రోజులు నాన్స్టాప్ వర్షాలే వర్షాలు..
ఏపీలో నేడు రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశముంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా వానలు పడతాయి గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.ఈ ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు …
Read More »నోట్ల హాస్పిటల్.. ఇక్కడ కాలిన, చిరిగిన నోట్లు కూడా తీసుకోబడును..
మన దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగినా, కాలిపోయినా ఏం చేస్తాం, వాటిని ప్లాస్టర్తో అతికించి చెలామని చేసేలా చూస్తాం. కానీ అక్కడ కూడా చెలామని కాకపోతే ఇక చేసేదేమి లేక పడేయడమో దాచి పెట్టడమో చేస్తుంటాం. మనకు ఎదైనా సమస్య వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో.. నోట్లను సరిచేసేందుకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. కరెన్సీ హాస్పిటల్స్ ఇవెక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ వద్ద “నోట్ల హాస్పిటల్” పేరుతో ఈ షాప్ ఉంది. …
Read More »సింగపూర్లో చంద్రబాబు సభకు కిక్కిరిసిన ఆడిటోరియం… ఐదు దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రజలు..
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి సింగపూర్తో సహా సమీప ఐదు దేశాల్లోని తెలుగువారు, ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. సభా నిర్వహణ కోసం నిర్వహకులు తీసుకున్న వన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం తరలివచ్చిన తెలుగువారితో నిండిపోయింది. ఊహకుమించి వచ్చిన తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. దీంతో అనుబంధంగా ఉన్న మరో ఆడిటోరియంలోకి సభికులను నిర్వాహకులు తరలించారు. తెలుగు ప్రజల …
Read More »