తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే …
Read More »టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఇలా చేస్తే ఒక్కొక్కరికి రూ.5లక్షలు, పదవులపై కీలక ప్రకటన!
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. పార్టీకి కార్యకర్తలే బలమని.. వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, గ్రామ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి …
Read More »ఏపీలో వారందరి పింఛన్లు కట్.. కీలక ఆదేశాలు, ఆ ఛాన్స్ ఉంటుంది!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించగా.. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటుకు సిద్ధమవుతున్నారు.. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో అలాంటివారిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు.. ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే …
Read More »తిరుపతి లడ్డూ వివాదం వేళ.. తిరుమలలో మహాశాంతి యాగం!
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో …
Read More »తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే …
Read More »కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు వేల కోట్లు!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన …
Read More »LIC సంచలన నిర్ణయం.. ఇక రోజుకు రూ.100 చాలు.. అక్టోబర్ 7లోపే అమలులోకి!
LIC: ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్న మదుపరులను ఆకర్షించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పెట్టుబడిదారులకు తమ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. త్వరలోనే రోజుకు రూ.100తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ రవి కుమార్ …
Read More »తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక రైలు పొడిగింపు, ఈ రూట్లోనే
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ప్రత్యేక రైలును డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోలాపూర్-తిరుపతి-సోలాపూర్(01437/01438) మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు రాయలసీమ మీదుగా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గడువును డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా.. ట్రైన్ ఆన్ డిమాండ్ ఉండడంతో డిసెంబరు 26వ తేదీ వరకు.. తిరుపతి- సోలాపూర్ నడుమ (04138) …
Read More »మీరు మీ హద్దుల్లో ఉండండి.. ప్రకాష్ రాజ్కు విష్ణు మంచు వార్నింగ్
తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ, తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా, భక్తుల మనోభవాలు దెబ్బ తీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారికి నాసిరకం నెయ్యిని.. జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ …
Read More »జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్, టీడీపీలోకి చేరాలనుకున్నా!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి ఎదురుగాలి విస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయిన ఆయన చివరికి జనసేనవైపు మొగ్గు చూపారట. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆదివారం జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో …
Read More »