టెన్త్, ఇంటర్మియట్ చదువుతున్న విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులకు వాతలు తేలాయి. విషయం తెలియడంతో తల్లిదండ్రులు.. స్కూల్కి చేరుకుని ఆందోళన దిగారు. అతడ్ని సస్పెండ్ చేయాంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చదువు చెప్పాలి.. తప్పు చేస్తే.. కాస్త గట్టిగా భయం చెప్పాలి. అంతేకానీ ఇలా పశువులను బాదినట్లు బాదితారా..? సిద్దిపేట – కొండపాక మండలం దుద్దెడలోని గురుకుల పాఠశాలలో చదువతున్న 30 మంది ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులు.. ఉదయం వేళ నిర్వహించిన ప్రత్యేక స్టడీ అవర్స్కు వివిధ కారణాల …
Read More »మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామని, కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా గ్రూప్-3 ‘కీ’ విడుదల చేశామని, రెండ్రోజుల్లో గ్రూప్ 2 ‘కీ’ కూడా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం …
Read More »వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తాం.. ఇంటర్ విద్యా మండలి
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణల దిశగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా సంస్కరణలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సైతం సీబీఎస్ఈ విధానంలోకి మారింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ …
Read More »ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు ఉండవ్. ఈ మేరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించినట్లు ఇంటర్ బోర్డు బుధవారం (జనవరి 8) ప్రకటన జారీ చేసింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) సంచలన ప్రటకన చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని …
Read More »ఇకపై ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్కు చెక్.. నిఘా నీడలోనే ప్రయోగాలు
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ప్రయోగ పరీక్షలు ఉండగా.. బైపీసీ విద్యార్థులకు వీటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే విద్యార్ధులకు ఫుల్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో..ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు జరగాలని బోర్డు నిర్ణయించింది. ఈ …
Read More »AP School Syllabus: 9, 10 తరగతుల్లో హిందీ టెక్స్ట్ బుక్స్ మారుతున్నాయోచ్.. పాఠశాల విద్యాశాఖ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల హిందీ సిలబస్ మారనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల హిందీ సిలబస్ ను మార్చి గతంలో రద్దు చేసిన రాష్ట్ర సిలబస్ని తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ తరగతుల్లో NCERT సిలబస్ అమలు చేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు తరగతుల సిలబస్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య …
Read More »జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?
2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 18, ఏప్రిల్ 16 తేదీల్లో నిర్వహించనున్నారు. తొలి విడత పరీక్షకు సంబంధించిన పరీక్ష మాత్రం జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మలి విడత పరీక్ష ఏప్రిల్ 16వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తవగా అడ్మిట్ కార్డులు సైతం విడుదలయాయి. విద్యార్ధుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేదీ …
Read More »డిగ్రీ సైన్స్ కోర్సుల్లో క్రెడిట్లకు భారీగా కోత.. ప్రాక్టికల్స్ రద్దు! వచ్చే ఏడాది నుంచి అమలు
తెలంగాణ ఉన్నత విద్యామండలి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ సైన్స్ కోర్సుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ పాయింట్లను భారీగా తగ్గించనుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా రద్దు చేయనుంది. వీటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ లను తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని …
Read More »‘అన్ని పోటీ పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి’ ఏపీపీఎస్సీ సంస్కరణల కమిటీ నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో సూచించింది. ప్రభుత్వశాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని, ఇకపై అలా జరగడానికి వీలులేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం 272 రకాల పోస్టులను నాన్ టెక్నికల్, టెక్నికల్ సర్వీసెస్ కేటగిరీలుగా విభజించి, నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రూప్ 1, గ్రూప్ 2, …
Read More »యూజీసీ- నెట్ అడ్మిట్కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ
యూజీసీ- నెట్ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు యూజీసీ వీటిని విడుదల చేసింది. అభ్యర్ధులు తమ వివరాలు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి..యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 (యూజీసీ- నెట్) పరీక్ష మరో 3 రోజుల్లో …
Read More »