తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్ 2025) పరీక్షను ఈసారి కాస్త ముందుగానే జరపాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్లోనే ఈఏపీ సెట్ 2025 నిర్వహించనున్నట్లు గతంలో తెల్పింది కూడా. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి తెల్పినట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో జరగనున్న …
Read More »ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మొత్తం నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అయితే ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీలను కమిషన్ కార్యదర్శి ప్రదీప్కుమార్ వెల్లడించారు. ఏయే …
Read More »నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఒకేసారి రెండు జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఎంపికైన …
Read More »దారుణం.. ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య..! కాలేజీ యామన్యాలపై అనుమానాలు
తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్న తరుణంలో ఒకే రోజు ఇద్దరు విద్యార్ధుల ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చణీయాంశంగా మారాయి. వివరాల్లోకెళ్తే.. అన్నోజిగూడ నారాయణ జూనియర్ కాలేజీలో ఉరి పెట్టుకుని ఒకరు.. బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్ నాయక్ (16) అనే విద్యార్ధి అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన …
Read More »‘త్వరలోనే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తాం’.. సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గ్రూప్ 1 తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్ 1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఏవిధమైన …
Read More »పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చి 15 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు సమాచారం. ఈ …
Read More »స్కూల్ విద్యార్థులకు షాక్.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్ …
Read More »ఉద్యోగుల శిక్షణకు స్వదేశీ ఫ్రేమ్వర్క్.. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా..
ఫ్రేమ్వర్క్లోని అంశాలపై కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘భారతదేశ భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రధాని మోదీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. ప్రధాని మోదీ చెప్పిన వికాస్, గర్వ, కర్తవ్య, ఐక్యత అనే నాలుగు సందేశాలను గుర్తించాము. ఈ నాలుగు తీర్మానాలను సాధించడానికి, ప్రభుత్వ అధికారులు…స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి స్వదేశీ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 2047 నాటికి విక్షిత్ భారత్ అనే మోదీ గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. ఆధునిక బ్యూరోక్రసీకి శిక్షణ …
Read More »CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2024.. నవంబర్ 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 170 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ఆన్సర్ కీ డిసెంబర్ 3న విడుదలకానుంది. అభ్యంతరాలు డిసెంబర్ 5వ తేదీలోగా ఆన్లైన్లో తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరి …
Read More »స్కూల్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీఈ మార్కుల విధానంలో విద్యాశాఖ కీలక మార్పులు.. కొత్త విధానం ఇదే
రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు మూల్యాంకన విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీసీఈ మార్కుల్లో విద్యాశాఖ మార్పులు చేసి.. కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నూతన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో మార్కుల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ క్రమంలో గతంలో ఉన్న విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. గతంలో రాత పరీక్షకు 20 మార్కులు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 35 మార్కులకు మార్చింది. ఫార్మెటివ్ …
Read More »