కాకతీయ హాస్టల్లో విద్యార్థి మృతిపై నిరసనగా..నిజామాబాద్లో ఆందోళనకు సిద్ధమయ్యాయి విద్యార్థి సంఘాలు. కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.నిజామాబాద్ నగరంలోని కాకతీయ స్కూల్లో గుడాల శివజశ్విత్ రెడ్డి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి శుక్రవారం(నవంబర్ 29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప అస్వస్థతకు గురైన శివజశ్విత్ రక్తపు వాంతులతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అయితే తల్లిదండ్రులకు అలస్యంగా సమాచారం ఇవ్వడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో తమ కుమారుడి మరణం సహాజ మరణం కాదని, …
Read More »మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
పీజీ మెడికల్ సీట్ల స్కామ్లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది. తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీమంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 …
Read More »అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్ టైమ్ లేక అవస్థలు..
అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ వెలుపల అక్రమంగా పార్ట్టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేళ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున …
Read More »తెలంగాణలో రేపు స్కూళ్లు బంద్.. కారణం ఇదే
తెలంగాణలో సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలిక మృతి చెందగా.. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఇప్పుడు స్టేట్ లెవల్ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పాటు ఆందోళనల పర్వం కొనసాగుతోంది, ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల ఫుడ్ పాయిజన్ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆయా …
Read More »‘ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్లో నిరుద్యోగ రేటు చాలా తక్కువ’.. కేంద్ర మంత్రి వెల్లడి
దేశంలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభకు తెలియజేశారు. 2023-24లో భారతదేశంలో యువత నిరుద్యోగిత రేటు 10.2 శాతంగా ఉందని, ఈ రేటు ప్రపంచ దేశాలతో పోల్చితే తక్కువగా ఉంది పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 25న లోక్సభలో మంత్రి శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి, నిరుద్యోగ గణాంకాల వివరాలు వెల్లడిస్తూ.. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) మన దేశంలో ఉపాధి, నిరుద్యోగ యువతకు …
Read More »NEET PG 2024 Counselling: పీజీ మెడికల్ తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి.. డిసెంబరు 20 నుంచి తరగతులు షురూ
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోఎండీ, ఎంఎస్ పీజీ మెడికల్ నాన్ సర్వీస్ కేటగిరీ సీట్లకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తైంది. మొత్తం 1722 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్లో భర్తీ అయ్యాయని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్ కాలేజీల్లో డిసెంబరు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా చేరాల్సి ఉంటుందని పేర్కొంది. ఫస్ట్ ఇయర్ పీజీ మెడికల్ తరగతులు డిసెంబరు 20వ …
Read More »ఏపీలో నార్మలైజేషన్ లేకుండా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు.. సాధ్యమయ్యేనా?
రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. భారీగా ఉపాధ్యాయ పోస్టులకు ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. అయితే రాత పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుంది కాబట్టి పలు విడతలుగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కొందరికి ప్రశ్నాపత్రం కఠినంగా, కొందరికి సులువుగాత వస్తుండటంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. పైగా నార్మలైజేషన్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు.. దీనికి స్వస్తి చెప్పేందుకు..ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని …
Read More »AP Pharmacy Counselling: ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలు షురూ.. రేపట్నుంచి కౌన్సెలింగ్
ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది..ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో, 30 నుంచి డిసెంబరు 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 వరకు, బైపీసీ విద్యార్థులకు …
Read More »Khammam District: ఆ ప్రభుత్వ పాఠశాలలో ఒక స్టూడెంట్.. ఒక టీచర్ ..
అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఒక లక్ష కాదు… రెండు లక్షలు కాదు.. ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.. ఎలా అంటారా. .ఆ పాఠశాల ఎక్కడ ఉంది అంటారా..? ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం …
Read More »AP Mega DSC 2024 New Syllabus: టీచర్ అభ్యర్ధులకు గుడ్న్యూస్.. మెగా డీఎస్సీ కొత్త సిలబస్ వచ్చేసింది! డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటికే కొన్ని కారణాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా సన్నద్ధత కొనసాగించాలని ఇటీవల విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ సిలబస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్ నవంబర్ 27 (బుధవారం)వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ డీఎస్సీ వెబ్సైట్లో సిలబస్ను పాఠశాల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal