ఎడ్యుకేషన్

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 3 రోజులు పాఠశాలలకు సెలవులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వేసవి సెలవులు ముగిసి ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ. మరి ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి? అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర …

Read More »

ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. …

Read More »

ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న …

Read More »

‘మోడల్‌ విద్యకు నిర్మాణాత్మక సంస్కరణలు తెస్తున్నాం..’ కేంద్రమంత్రితో లోకేశ్‌ భేటీ

ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్‌ఈఏపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు …

Read More »

ఇంటర్‌ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 17 నుంచి జూన్‌ 23వ …

Read More »

తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు …

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ఇదే.. 1:2 నిష్పత్తిలో ఎంపిక!

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్‌ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఏపీపీఎస్సీ …

Read More »

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌..

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్‌ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …

Read More »

 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్‌లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ …

Read More »