క్రైమ్

 బీ అలెర్ట్.. హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠా.. కీలక సూచన పోలీసులు

హైదరాబాద్ ప్రజలకు బీ అలెర్ట్.. మీ పిల్లలు జాగ్రత్త. నగరంలో చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తూ టెన్షన్ పుట్టించిన ఓ ముఠా చివరకు పోలీసుల చేతికి చిక్కింది. పిల్లలను ఎత్తుకుపోయి వారిని విక్రయించేందుకు యత్నించిన ఈ ముఠాలో నలుగురిని చందానగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మాదాపూర్‌ డీసీపీ వినీత్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఇంట్లో పెద్దలు లేని సమయాల్లో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని, రెక్కీ చేసి చిన్నారులను అపహరిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్ …

Read More »

నార్కోటిక్స్‌ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన!

కొంతమంది విద్యార్థులపై నమోదైన నార్కోటిక్స్ కేసుపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల మేడూరి స్పందించారు. విశ్వవిద్యాలయం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కఠిన శిక్షలు విధిస్తారని ప్రకటించారు. పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌ వాడుతున్నారని నమోదైన నార్కోటిక్స్‌ కేసుపై మహీంద్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ యాజుల మేడూరి స్పందించారు. దీనికి సంబందించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం …

Read More »

చోరీ కేసును విచారిస్తుండగా ఊహించని ట్విస్ట్.. ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమే..

తునిలో వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఈ చోరీ వెనక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. అమ్మాయిగా మారాలని ఆకాంక్షించిన సతీష్‌ (అవంతిక రెడ్డి) తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్‌ సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకోవడానికే ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు వెనుక ఒక ఊహించని స్టోరీ బయటపడింది. ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్న ఆరాటమే ఈ క్రైమ్‌కు కారణమని పోలీసులు తేల్చారు. ఆగస్టు 20న తుని …

Read More »

లేడి డాన్ అరుణ పెద్ద కి’లేడీ’.. వామ్మో.! లిస్టు పెద్దదే ఉందిగా.. చూస్తే అవాక్

రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అరుణ ఫోన్ డేటా ఆధారంగా బైట పడుతున్న సెటిల్మెంట్ దందాలు చూస్తుంటే ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులు సన్నిహితంగా ఉంటున్న విషయాలు బయట పడుతున్నాయి. దీంతో గతంలో అరుణతో సన్నిహితంగా మెలిగిన రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో దడ మొదలైందట. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు బయట ఉన్న అరుణ హోం శాఖలోని కీలకంగా ఉన్న వారితో లాబీయింగ్ చేసి పెరోల్ తెప్పించిన …

Read More »

ఛీ.. ఛీ.. ఇలా చేశావేంట్రా దుర్మార్గుడా.. మూసీలో 10 కిలోమీటర్లు వెతికినా లభించని స్వాతి శరీర భాగాలు..

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌ గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతిని హత్య చేసిన మహేందర్.. తల, కాళ్లు, చేతులను మూసీలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో మూసీలో 10 కిలోమీటర్ల వరకు వెతికినప్పటికీ.. మృతురాలి శరీర భాగాలు లభించలేదు. వరద ప్రవాహానికి శరీర భాగాలు కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి మొండెం ప్రస్తుతం గాంధీ మార్చురీలోనే ఉంది. ఇప్పటికే నిందితుడు మహేందర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు మేడిపల్లి పోలీసులు. పక్కా ప్లాన్‌తో మర్డర్‌ చేశాడు మహేందర్‌. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం …

Read More »

మా పెళ్లికి తప్పకుండా రండి అంటూ వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌.. ఓపెన్‌ చేసి చూడగా..

రోజురోజుకూ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త టెక్నాలజీలతో జనాలను నిండా ముంచి.. అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రాగా.. ఎవరిదా అని ఒపెన్‌ చేశాడు. అంతే అతని అకౌంట్లోంచి రూ.2లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు.వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను ఓపెన్‌ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.2లక్షలు పొగొట్టుకున్న ఘటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హింగోలీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి …

Read More »

SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్-2లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆడిట్ టీం విచారణలో 4 కోట్ల గోల్‌మాల్ వ్యవహారం బయటపడగా.. మరింత లోతుగా ఆటిట్ చేసిన అదికారులకు కళ్లు బైర్లు కమ్మే అక్రమాల చిట్టా లభించింది. దాదాపు రూ.1.07కోట్ల నగదు, 12.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు( ఐదున్నర కిలోలు) మాయమైనట్లు గుర్తించారు ఆడిటింగ్ టీం. ఈ నగదు, నగల మాయంలో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కీలక నిందితుడిగా తేల్చారు. మేనేజర్ …

Read More »

కూకట్‌పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి మరిన్ని నమ్మలేని నిజాలు.. పక్కా ప్లాన్‌తోనే.!

ఒక పదిహేనేళ్ల పిల్లాడు కిరాతకంగా మర్డర్‌ చేస్తాడా? డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడా? పదేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో ఈ కిల్లర్‌ మైండ్‌సెట్‌ ఇప్పుడు షాకింగ్‌గా మారింది? నెత్తురు చూస్తేనే భయపడే వయసులో, ఎలా నెత్తురు పారించాడు? సహస్ర తల్లిదండ్రుల గుండెకోత అందరినీ కలచివేస్తుంటే, ఈ పిల్లవాడి ప్రవర్తన మరోవైపు చర్చనీయాంశంగా మారింది. కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ దే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతులతో …

Read More »

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏపీ మంత్రి బ్యాంక్ ఖాతాలకే ఎసరు పెట్టారు.. ఏకంగా..!

సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురపాలక …

Read More »

వ‌న‌స్థలిపురం ఏసీబీ రైడ్స్.. రూ. 70వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన స‌బ్ రిజిస్ట్రార్!

అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్‌ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా స‌బ్ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో స‌బ్ రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా …

Read More »