క్రైమ్

మూసీలో బట్టలు లేకుండా మహిళ డెడ్‌ బాడీ.. అంతు చిక్కని మిస్టరీగా మర్డర్ కేసు!

రాజేంద్రనగర్ కిస్మత్ పూర్‌లో మహిళ డెడ్ బాడీ కలకలం. గుర్తు తెలియని మహిళలను హత్య చేసిన దుండగులు. ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానం. మృత దేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ బృందాలు పలు ఆధారాలు స్వేకరిస్తున్నాయి. కిస్మత్ పూర్ బ్రిడ్జి కిందకి మహిళలను తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ …

Read More »

మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. వామ్మో.. మద్యం తాగించి భర్త ఏం చేశాడో తెలుసా..?

గుంటూరు నగరంలోని సీతమ్మకాలనీకి చెందిన రామాంజినేయులు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదిన ఇంటి నుండి వెళ్లిపోయిన రామాంజినేయులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య శివ పార్వతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజినేయులు అదృశ్యంపై మొదట పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత శివ పార్వతి అదే కాలనీకి చెందిన కొండయ్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకొని …

Read More »

తిరుపతిలో మిస్టరీ మరణాలు.. అటవీ ప్రాంతంతో లభ్యమైన నాలుగు మృతదేహాలు!

తిరుపతి జిల్లా పాకాల మండలంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పాకాల వారి పల్లి అటవీ ప్రాంతంలో నాలుగు డెడ్ బాడీలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోకి పశువులను మేపేందుకు వెళ్లిన స్థానికులకు ఈ మృతదేహాలు కనిపించడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చెట్టుకు ఉరి వేసుకున్న రెండు మృతదేహాలను గుర్తించగా పక్కనే మరో రెండు డెడ్ బాడీలను పూడ్చి పెట్టినట్లు కనుగొన్నారు. చెట్టుకు వేలాడిన రెండు డెడ్ బాడీ …

Read More »

లక్కీ భాస్కర్‌ను మించిపోయావ్ కదా మావ.! కిలోల బంగారం హుష్ కాకి..!

ప్రజల్లో ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకాన్ని వమ్ము చేసే ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఎస్‌బీఐ గోల్డ్ లోన్ గోల్‌మాల్ ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లాలోని ఎస్‌బీఐలో మరో గోల్డ్ లోన్ గోల్ మాల్ వ్యవహారం బట్టబయలైంది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా ఆడిట్‌లోనే అక్రమాల భాగోతం బయటపడింది. నిర్మల్ లోనూ ఇంటి దొంగే బ్యాంకుకు కన్నం వేసి 20 లక్షల రూపాయలకు పైగా స్కామ్‌కు పాల్పడ్డాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో బ్యాంకు మోసం బట్టబయలైంది. మంచిర్యాల …

Read More »

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ …

Read More »

అయేషామీరా హత్య కేసులో వీడని మిస్టరీ.. 18 ఏళ్లుగా దక్కని న్యాయం!

18 ఏళ్లుగా అయేషామీరా హత్య కేసు కోర్టులో నానుతూనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో న్యాయం మరింత ఆలస్య మవుతుంది. ఈ కేసును CBIకి అప్పగించినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిలిపోయే పరిస్థితి నెలకొంది.. గత 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న అయేషామీరా హత్య కేసు విచారణలో తీవ్ర జాప్యం నెలకొంది. 2007 డిసెంబర్‌ 27న రాత్రి లేడీస్‌ హాస్టల్‌లో విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిగా …

Read More »

విమానం ల్యాండ్ కాగానే.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. బ్యాగులు ఓపెన్ చేయగా

యువర్ అటెన్షన్ ప్లీజ్..! 6E1068 విమానం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. రన్‌వేపై వచ్చిన ఆ విమానంలో నుంచి ప్రయాణీకులు ఒక్కొక్కరిగా కిందకు దిగుతున్నారు. ఇక వారిలో ఇద్దరు కదలికలు తేడాగా కనిపించాయి. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బాగా రద్దీగా ఉంది. అప్పుడే బ్యాంకాక్ నుంచి ఓ విమానం రన్‌వేపైకి వచ్చింది. ఎగ్జిట్ గుండా ప్రయాణీకులు ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. ఇక వారిలో ఇద్దరు వ్యక్తులు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ ఇద్దరిని పక్కకు పిలిచి చెక్ …

Read More »

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..

నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దీపక్‌. హాస్టల్‌లో ఒకే గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్‌ చౌహాన్‌తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్‌లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్‌ హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్‌ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆ విద్యార్థిని కాల్చిచంపిన రూమ్‌మెట్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీపక్ హత్య తర్వాత తానూ కాల్చుకుని దేవాన్ష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు …

Read More »

పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీకి చిక్కిన మరో లేడీ ఆఫీసర్!

రాష్ట్రంలో అవినీతి పరులను ఏరిపారేడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుపడింది. హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుపడ్డారు. అమె నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న కొందరిలో మాత్రం అస్సలూ మార్పు రావడం లేదు. మనల్ని ఎవరులే పట్టుకునేది అనేలా జనాల నుంచి లంచాలు …

Read More »

సినీ ప్రముఖుల ఇళ్లకు అదే పనిగా వెళ్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఏంటా అని ఆరా తీయగా

హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులను వేధించిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరరావు చివరికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానంటూ సినీ సెలబ్రిటీలను భయపెట్టడం, వారి ఇళ్లకు వెళ్లి వేధించడం, పెద్ద ఎత్తున బెదిరింపులు గురిచేయడం వంటి పనులతో.. కలకలం రేపిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడి వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు, తన హోదాను మించిపోయి ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకుంటూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన వాట్సాప్‌ డీపీ, స్టేటస్‌లలో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ …

Read More »