గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ …
Read More »వీరరాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు..
దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయ్.. ఇలాంటి వాళ్లలో వీరరాఘవరెడ్డి తీరు వేరే లెవెల్..! ఇతని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.మ్యూజిక్ టీచర్గా కెరీర్ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్ ఆర్మీని రెడీ చేసుకున్నాడు.. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి మొదటి స్లాట్లో 5 …
Read More »వెర్రితలలు వేస్తున్న ‘విలనిజం’.. పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా..!
మాయమైపోతున్నాడమ్మ..మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. నిజమే.. మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. క్షణికావేశంలో, అనుమానపు పొరల్లో, పేగుబంధాన్ని సైతం చూడలేని కర్కశత్వంతో ప్రవర్తిస్తున్నాడు మనిషి. సమాజంలో ఈ పోకడలు కారణాలేంటో చెప్పుకుందాం..చిన్నప్పుడు ఎత్తుకుని చాక్లెటిచ్చిన తాతకు.. కసితీరా కత్తిపోట్లు, ఇంటికి రాగానే ఆప్యాయంగా అన్నం పెట్టే ఇల్లాలికి రోకటిపోటు.. ముద్దుముద్దుగా అమ్మా, నాన్నా అని పిలిచే కన్నపేగుకు ఒంటిపై అక్రమ సంబంధాల వాతలు..! ఏరా సిట్టింగ్కు రెడీయా …
Read More »డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…
2019లో రామ్గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూట్యూబ్లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట విడుదల చేశారని గుంటూరు జిల్లాకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్కు చెందిన వంశీకృష్ణ బండారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన వ్యాఖ్యలతో ఎప్పుడు సంచలనం సృష్టించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ …
Read More »ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?
బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం ఎన్నో చట్టాలను మనదేశంలో తీసుకుని వచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటుగా ఆ కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టంలో ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023 లో 1877 కేసులు నమోదు …
Read More »కనీసం రూ.10 లక్షలు దొరుకుతాయనుకుంటే రంగంలోకి.. బత్తుల రూటే సెపరేట్
బత్తుల ప్రభాకర్ వీడు మామూలోడు కాదు.. అతడి లైఫ్స్టైల్, మోటివ్స్ చూస్తే వీడో బడాచోర్.. వారంలో ఆ ఒక్కరోజే చోరీలు.. వీకెండ్లో జల్సాలు..! ప్రతీకారం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి ఏకంగా 3 గన్లు, 500 బుల్లెట్లు కొన్నాడంటే ఎంతంటి ఉన్మాదో అర్థం చేసుకోవచ్చు.. ఈ బత్తుల ప్రభాకర్ హిస్టరీపై స్పెషల్ స్టోరీ..బత్తుల ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా.. 2013 నుండి చోరీలు ప్రారంభించిన ప్రభాకర్.. ఇప్పటివరకు ఏడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, …
Read More »ఇకపై పేపర్ లీక్ చేస్తే దబిడి దిబిడే.. విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు తొలిసారిగా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. పబ్లిక్ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు చర్యలకు ఉపక్రమించింది..తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ …
Read More »ఆడపిల్లల పాలిట తోడేళ్లు.. మతి తప్పిన మదపిచ్చోళ్లు… ఒక్కోడు ఒక్కో టైపు
కామాతురాణాం నభయం నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి.. సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం.. ఎందుకు ఆశిస్తాం…? అక్షరం ముక్క రానివాడైనా.. మాస్టర్స్ డిగ్రీ చదివినవాడైనా.. అందరిదీ అదే బాపతు. ఎవ్వరికీ కనీస ఇంగితం లేదు. చట్టాలంటే భయం లేదు. ప్రస్తుతానికి తెలుగురాష్ట్రాల్లో ఓ నలుగురు కామోన్మాదులపై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది. మతితప్పి, మదమెక్కిన కామ పిశాచుల స్వైరవిహారం సమాజంలో ఏ రేంజ్లో నడుస్తోందో తెలుస్తోంది.వందమంది అమ్మాయిలే నా టార్గెట్ అంటాడొకడు. ట్రిపుల్ సెంచరీ కొట్టాకే …
Read More »మృత్యు లారీలు.. హైదరాబాద్లో హెవీ వెహికిల్స్ ఎంట్రీపై టీవీ9 ఎఫెక్ట్.. పోలీసుల అలర్ట్..
షేక్పేట్ రోడ్డుప్రమాద ఘటనతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నో ఎంట్రీ సమయం తర్వాత సిటీలోకి వస్తున్న భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. పంజాగుట్ట సర్కిల్లో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, వాటర్ ట్యాంకర్స్, మినీ లోడ్ వాహనాలపై ఫైన్లు విధించారు.ప్రజల ప్రాణాలంటే వేళాకోలంగా ఉందా?…లారీలను, హెవీ వెహికల్స్ను వేళాపాళాలేకుండా సిటీలోకి ఎలా అనుమతిస్తున్నారు? నో ఎంట్రీ నిబంధనలు తుంగలో తొక్కుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? నో ఎంట్రీ టైమ్లో సిటీలోకి దూసుకొచ్చిన లారీ …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది.. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం నలుగురు అరెస్టయ్యారు.తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు …
Read More »