సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. …
Read More »రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు.. పేల్చేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్..!
ఆర్బీఐను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజు వ్యవధిలో ఆర్బీఐకి బెదిరింపులు రావడం ఇది రెండో సారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. RBI అధికారిక వెబ్సైట్లో రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లు ఒక ఇమెయిల్ వచ్చింది. ఆర్బీఐకి బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్బీఐని బాంబుతో పేల్చివేస్తామని మెయిల్లో పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే …
Read More »చూడటానికి తియ్యటి చాక్లెట్స్లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!
చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే …
Read More »ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..
హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని భరత్ నగర్లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి …
Read More »ఫాంహౌస్ నుంచి రాత్రి కాంట్రాక్టర్ను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయాన్నే సేమ్ ప్లేస్లో షాకింగ్ సీన్..!
రాత్రి కిడ్నాప్.. ఉదయానికి శవమై కనిపించిన కాంట్రాక్టర్.. శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టర్ కిడ్నాప్ అండ్ మర్డర్ సంచలనం రేకెత్తిస్తోంది. కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామ సమీపాన విద్యుత్ కాంట్రాక్టర్ రాజశేఖర్ రెడ్డిని తన ఫామ్ హౌసులో నిద్రిస్తుండగా రాత్రి కొంతమంది దండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉదయం అదే ఫామ్ హౌస్ వద్ద కూలీలకు షాకింగ్ సీన్ కనిపించింది. రాత్రి కిడ్నాప్ అయిన రాజశేఖర్ రెడ్డి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు. నల్లమాడ మండలం బొగ్గులపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ట్రాన్స్కో …
Read More »చిన్నారి ప్రాణం తీసిన మూఢనమ్మకం.. నెల్లూరు జిల్లాలో విషాదం
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చర్చిలో ప్రార్థనలు చేస్తే బతుకుతుందనే ఆశతో చిన్నారి తల్లిదండ్రులు చేజర్ల మండలం అదురుపల్లిలోని చర్చిలో భవ్యశ్రీతో ప్రార్థనలు చేయిస్తూ వచ్చారు. సుమారు 40 రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే భవ్యశ్రీ ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి కన్నుమూసింది. దీంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం బాగవుతుందని.. ఆస్పత్రికి వెళ్లకుండా తల్లిదండ్రులను పాస్టర్ మభ్యపెట్టారంటూ కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. …
Read More »పాపం..తాకట్టుపెట్టిన బంగారం చీప్గా వస్తోందని వేలంలో కొన్నాడు.. కట్ చేస్తే..
ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. ఓ వ్యక్తి లక్షలు పెట్టి బంగారం కొన్నాడు. ఆ తర్వాత బంగారం కట్ చేస్తే వెండి బయటపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకులను కేంద్రంగా చేసుకొని నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేసిన కేటుగాళ్ల బాగోతం ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మణుగూరులో …
Read More »ఇరవై ఏళ్ల నుండి కొనసాగుతున్న అక్రమ సంబంధం.. కట్ చేస్తే.. పొలంలోకి రమ్మని..
ఆమె పేరు రమాదేవి.. సత్తెనపల్లి రంగా కాలనీలో నివాసం ఉండే రమాదేవికి వివాహమైంది.. ఇద్దరు పిల్లలున్నారు. అయితే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన వెంకట్రావుతో రమాదేవికి వివాహేతర సంబంధం ఉంది. వెంకట్రావుకి వివాహమై ఇద్దరూ పిల్లలున్నారు. రమాదేవి, వెంకట్రావులకు పెళ్లై పిల్లలున్నా వీరిద్దరి మధ్య గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దాదాపు ఇరవై ఏళ్ల నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే రమాదేవి తన బంగారాన్ని వెంకట్రావు చేత బ్యాంక్లో తాకట్టు పెట్టించింది. అయితే ఇద్దరూ మధ్య ఎటువంటి …
Read More »శ్రీశైలంలో కలకలం.. రాత్రివేళ కొండ పై నుంచి దూకిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి బుర్రె వెన్నెల అనే యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి వెన్నెల ఆన్లైన్ లోన్ యాప్ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం కోసం నిన్న రాత్రి శిఖరం వద్ద చేరుకుంది. కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు వెంటనే స్పందించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం …
Read More »జైల్లో ఖైదీ విచిత్ర ప్రవర్తన.. ఆస్పత్రికి తీసుకెళ్లి బాడీ ఎక్స్ రే తీయగా..
అధికారులకు జైల్లో ఫోన్ ఛార్జర్ కనిపించింది. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారని భావించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఓ ఖైదీ ప్రవర్తన తేడాగా ఉండటంతో…జైలు అంటే క్రిమినల్స్ ఉండే ప్లేస్. అక్కడ కట్టుదిట్టమైన భద్రత.. పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఎవరైనా లోపల ఉన్న తమ వాళ్లను ముందుస్తు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక జైల్లో ఖైదీలకు కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి జైలు అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన …
Read More »