Post Office: గత కొంతకాలంగా దేశంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ.. చాలా మంది నార్కొటిక్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన కిలోల కొద్ది డ్రగ్స్.. దొరుకుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ డ్రగ్స్ కట్టడి చేసేందుకు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. వాటి సరఫరా మాత్రం ఆగడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్ను పోర్టుల వద్ద, ఎయిర్పోర్టుల వద్ద పట్టుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాదారులు రూటు మార్చారు. …
Read More »వయనాడ్ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం?
Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా …
Read More »ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం.. బీజేపీ సీఎంలను పక్కన పెట్టి మరీ..!
Chandrababu: హర్యానాలో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార మహోత్సవం.. చండీగఢ్లోని పంచకుల పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు 18 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో కింగ్ మేకర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. …
Read More »మిస్ ఇండియా 2024గా నిఖితా పోర్వాల్.. ఇంతకీ ఆమె ఎవరంటే?
Nikita Porwal: ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటం మధ్యప్రదేశ్కు చెందిన నిఖితా పోర్వాల్ దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో అన్ని రాష్ట్రాలకు చెందిన అందాల తారలు పోటీ పడగా.. చివరికి నిఖితా పోర్వాల్నే విజయం వరించింది. మిస్ ఇండియాగా నిలిచిన నిఖాతా పోర్వాల్.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత నిఖితా పోర్వాల్.. సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన నందిని గుప్తా.. …
Read More »Reliance : రిలయన్స్ జియో సంచలనం.. కేవలం రూ.1099 ధరకే.. JioBharat V3 V4 ఫోన్లు.. స్మార్ట్ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు!
JioBharat V3 V4 phones launch: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మరో రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2024లో జియో భారత్ వీ3, వీ4 పేరిట వీటిని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సరసమైన ధరకు 4 జీ కనెక్టివిటీని అందించే ఈ రెండు ఫోన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. రూ.1,099 ప్రారంభ ధరతో జియోభారత్ V3, V4 మోడళ్లను విడుదల చేసింది. భారత్లో 2జీ నెట్ వర్క్పై ఉన్న కోట్లాది మంది …
Read More »వరదలతో చెన్నై అతలాకుతలం.. ‘హైడ్రా’పై చర్చ
చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాజధానితో పాటు దాని పరిసర జిల్లాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 300 ప్రాంతాలు నీట మునిగాయి. సబ్వేలల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. కొంత మంది నడుము లోతు నీళ్లలో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే …
Read More »Jammu Kashmir: 20 సార్లు చావు నుంచి బయటపడి.. జమ్మూ కాశ్మీర్లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ
Jammu Kashmir: ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించగా.. తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. ఆమె …
Read More »Rs 10 Coin: రూ.10 కాయిన్లు ఉన్నాయా? మీకో గుడ్న్యూస్.. దిగ్గజ బ్యాంకుల కీలక నిర్ణయం!
Rs 10 Coin: ప్రస్తుతం మార్కెట్లో రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదు. ఏదైనా కొనుగోలు చేసి 10 రూపాయల నాణెం ఇస్తే చెల్లడం లేదని తీసుకోవడం లేదు. ఈ అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది. కొందరి వద్ద పదు సంఖ్యలో నాణేలు జమ అయ్యాయని చెబుతున్నారు. ఎవరూ తీసుకోకపోవడంతో నష్టపోవాల్సిందేనా అని బాధపడుతున్న వారూ ఉన్నారు. అయితే, అలాంటి వారదరికీ ఇది శుభవార్త అని చెప్పాలి. రూ.10 నాణేల చెల్లుబాటుపై ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ …
Read More »ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పండగకు ముందే దీపావళి గిఫ్ట్
Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ.. ప్రస్తుతం 53 శాతానికి పెరిగింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుండగా.. ఈ ఏడాది మార్చిలో పెంచగా.. ప్రస్తుతం మరోసారి పెంచారు. మార్చిలో 4 శాతం పెరిగిన డీఏ.. తాజాగా …
Read More »ఏకాభిప్రాయంతో సాగిన ఆ బంధం.. అత్యాచారం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఎలాంటి మోసపూరిత అంశాలు లేకుండా పరస్పర అంగీకారంతో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోన్న శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ వాగ్దానం మొదటి నుంచి నేరపూరితమని రుజువైతే తప్ప ఏకాభిప్రాయంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా చూడలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పెళ్లి చేసుకుంటానని హామీతో అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొరాదాబాద్కు చెందిన శ్రేయ్ గుప్తాపై ఉణ్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను జస్టిస్ అనీశ్కుమార్ గుప్తా రద్దు చేశారు. తన భర్త మరణించిన …
Read More »