IIT హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 7 GHz బ్యాండ్లో 6G ప్రోటోటైప్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 6G టెక్నాలజీ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది. ఈ తాజా టెక్నాలజీ ప్రజలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశ 6G టెక్నాలజీ ల్యాండ్స్కేప్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని IIT లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అనేక దేశాలు 5G టెక్నాలజీని స్వీకరించే ప్రక్రియలో ఉండగా, భారతదేశం 6G వైపు కీలక ముందడుగు వేసింది. IIT హైదరాబాద్ 6G టెక్నాలజీ నమూనాను అభివృద్ధి …
Read More »కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స
నెలలు నిండని శిశువుకు గుండె సమస్యతో చికిత్స అవసరమైంది. కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్యులు అత్యాధునిక డివైస్ ఉపయోగించి శస్త్రచికిత్స అవసరం లేకుండా పీడీఏ మూసివేశారు. ఈ డివైస్ తో చికిత్స పొంది కోలుకున్న అతి తక్కువ బరువుగల శిశువుగా .. ఈ బుడతడు రికార్డు సృష్టించాడు. ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు …
Read More »కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!
హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు. పోస్టాఫీస్ స్టాఫ్ మీ స్ట్రీట్ కే వచ్చి ఆధార్ సేవలు అందిస్తారు. అంతేకాదు అప్లై చేసుకున్న చోట సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మరిన్ని వివరాలు మీ కోసం.. దేశవ్యాప్తంగా ఆధార్ అప్ డేట్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆధార్ అప్ డేట్ కోసం బ్యాంకుల ముందు , ఆధార్ సెంటర్ల ముందు జనం క్యూలు …
Read More »జస్ట్.. 2 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి.. అమరావతిని కలుపుతూ రైల్వే శాఖ అదిరే ప్లాన్..
దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ సర్వే నిర్వహిస్తోంది. బుల్లెట్ రైలుతో హైదరాబాద్ – చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. ప్రస్తుతం 12గంటల సమయం పడుతోంది. దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ను వేగంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ను హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి …
Read More »వియోనా ఫిన్టెక్కి NPCI ఆమోదం.. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులకు కొత్త ఊపు
హైదరాబాద్ స్టార్టప్ వియోనా ఫిన్టెక్కి NPCI ఆమోదం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. వియోనా రూపొందించిన గ్రామ్పే ప్లాట్ఫారమ్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి పారదర్శక ధరలు, వేగవంతమైన చెల్లింపులను అందించనుంది. హైదరాబాద్కి చెందిన వియోనా ఫిన్టెక్ అనే స్టార్టప్ పెద్ద ముందడుగు వేసింది. ఈ సంస్థ గ్రామ్పే, వియోనా పే యాప్లను రూపొందించింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ …
Read More »ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలకు చెక్..
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. ధర తక్కువ ఉండటం, అన్నీ చోట్లకు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైల్వే బలోపేతానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణీకుల భద్రత, భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్ల పరిధిలోని అన్ని ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్లో …
Read More »దేశంలోని ప్రతి మూలలో మోహరించనున్న ‘బ్రహ్మాస్త్ర’.. త్వరలో రాబోతున్న S-400 కొత్త బ్యాచ్!
భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, S-400 రక్షణ వ్యవస్థ షాబాజ్-మునీర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. భారతదేశం S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ ప్రతి దాడిని నాశనం చేసింది. ఇప్పుడు అదే S-400 గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. ప్రతిదీ సరిగ్గా జరిగితే, భారతదేశం S-400 కొత్త బ్యాచ్ను అందుకోబోతుంది. త్వరలోనే భారతదేశానికి మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు …
Read More »తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, …
Read More »PF ఖాతాదారులకు గుడ్న్యూస్..! 3.0 వచ్చేస్తోంది.. ఇక ఈ సేవల్ని సులభంగా..
EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా PF ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నేరుగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు, UPI ద్వారా బదిలీ చేయవచ్చు. ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియ సరళీకృతం చేయబడింది, మరణ క్లెయిమ్లను వేగంగా పరిష్కరించబడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తన ప్లాట్ఫామ్ను మళ్ళీ అప్గ్రేడ్ చేసింది. కొత్త EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నిర్వహణ సులభతరం అవుతుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, TCS …
Read More »వరద బాధితులకు జియో, ఎయిర్టెల్ సాయం..! ఏ విధంగా అందిస్తున్నాయంటే..?
భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ టెలికామ్ సంస్థలైన జియో, ఎయిర్టెల్ ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దేశంలోని వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో 3 రోజుల చెల్లుబాటు పొడిగింపును ప్రకటించింది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మూడు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్లను పొందుతారు. జియోహోమ్ వినియోగదారులకు, అంతరాయం …
Read More »