టెక్నాలజీ

రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌… అక్టోబర్‌ 2లోగా భూ సమస్యల పరిష్కారం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌. ఆధార్‌, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్‌ సర్టిఫికెట్లు …

Read More »

హైదరాబాద్ వీధుల్లో గస్తీ కోసం శివంగులు… నయా డ్రెస్, స్పెషల్ ట్రైనింగ్..

హైదరాబాద్‌లో ఇకపై మహిళా పోలీసులు గస్తీ కాయనున్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు.. 2 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ధర్నాలు, ర్యాలీలు సహా ఇతర సమయాల్లో ఈ టీమ్స్‌ను మొహరించనున్నారు. తొలిసారిగా ఈ టీమ్ సచివాలయం వద్ద విధులు నిర్వహించింది. శాంతిభద్రతల పరంగా హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఇక్కడ సెక్యురిటీ బాధ్యతలు పోలీసులకు పెద్ద సవాల్. నిత్యం ఆందోళనలు, ధర్నాలు, రాస్తారొకోలు జరుగుతుంటాయి. చిన్న ఆందోళన లేదా అల్లర్లు జరిగినా అది రాష్ట్రం మొత్తం పాకే అవకాశం …

Read More »

9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రికార్డు స్థాయికి భారత్..!

ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి. భారతదేశ కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి. భారతదేశం గత 9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది. అక్టోబర్ 2024 తర్వాత మొదటిసారిగా, దేశ ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయి. జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు …

Read More »

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ రక్షణ సాంకేతికతలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమి సాంకేతికత, జలాంతర్గాములు, తీర రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఉగ్రవాదలుపై దాడికి ప్రతిదాడిగా భారత్‌పై పాకిస్థాన్‌ దాడులకు …

Read More »

ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. …

Read More »

కొంప ముంచిన SBI క్రెడిట్‌ స్కోర్.. చేతికందిన బ్యాంకు ఉద్యోగం హుష్‌..! కోర్టు షాకింగ్ ట్విస్ట్..

బ్యాంకింగ్‌ ఉద్యోగార్ధులకు క్రెడిట్ కార్డు హిస్టరీ గండంగా మారింది. పేలవమైన క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి నిర్మొహమాటంగా ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పూర్ క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి ఉద్యోగం ఉచ్చేందుకు నిరాకరించింది. ఎస్బీయే నిర్ణయాన్ని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్థించడం విశేషం. ఉద్యోగార్థులకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ తీర్పు స్పష్టం చేసింది..క్లీన్ క్రెడిట్ రికార్డ్, అధిక క్రెడిట్ స్కోరు, స్థిరమైన …

Read More »

దేశంలో మారో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇస్రో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెంచుతోంది. గతంలో ఏడాదికి ఒకటి రెండు ప్రయోగాలు మాత్రమే చేసే ఇస్రో ఇప్పుడు నెలకో లాంచ్ చేస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటిదాకా రాకెట్ ప్రయోగం అంటే కేవలం శ్రీహరికోట నుంచి మాత్రమే చేపట్టేది. కానీ ఇప్పుడు రాకెట్‌ లాంచ్‌ కోసం సెంటర్‌ను ఇప్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత్‌కు రెండో రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి …

Read More »

పాస్‌పోర్ట్ సేవల్లో కీలక మార్పులు.. పాస్‌పోర్ట్ జారీ మరింత ఈజీ

ఆధునిక కాలంలో ప్రపంచం కుగ్రామంగా మారింది. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు విపరీతంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే వేల సంఖ్యలో విమానాలు నిత్యం వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదువు, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, పర్యటన తదితర కారణాలతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళతున్నారు. ఆ ప్రయాణానికి ముందుగా పాస్ పోర్టు అవసరం.గతంలో పాస్ పోర్టు కావాలంటే నిబంధనల ప్రక్రియ చాాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాస్ పోర్టు సేవ 2.0 అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వేగంగా, సులభంగా …

Read More »

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఆయుధాలకు పెరిగిన డిమాండ్.. “ఆకాశ్” క్షిపణి వ్యవస్థతో పాటు “గరుడ” ఫిరంగులపై బ్రెజిల్ ఆసక్తి!

గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదు శక్తులను మట్టికలిపించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఉన్న స్థలం నుంచే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరుతో..ఈ ఆపరేషన్‌లో భారత్‌ ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు …

Read More »

ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ఉండడం …

Read More »