టెక్నాలజీ

 ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!

తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి కన్యాకుమారి వెళ్లే (హైదరాబాద్-కన్యాకుమారి- 07230) ట్రైన్‌ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్‌ …

Read More »

ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారికి కొత్త ‘రా’ చీఫ్‌గా బాధ్యతలు!

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ముఖ్యమైన నిఘా సమాచారాన్ని అందించిన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతి పరాగ్ జైన్‌ను కొత్త RAW చీఫ్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ IPS అధికారి. చాలా కాలంగా కేబినెట్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద నిఘా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ప్రస్తుత అధిపతి రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, దేశ బాహ్య నిఘా బాధ్యతలను …

Read More »

మరో 5 దేశాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. ముఖ్య లక్ష్యం అదే!

మరో నాలుగు దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు గురువారం (జూన్ 26) ఈ సమాచారాన్ని అందించారు. బ్రెజిల్‌తో పాటు, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోదీ ప్రతిపాదిత పర్యటన గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో ప్రధాన దృష్టి …

Read More »

ఆరేళ్ల తరువాత తెరుచుకోబోతున్న కైలాష్ మానసరోవర్ యాత్ర.. చైనాతో రాజ్‌నాథ్ చర్చలు!

చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయంలో భారతదేశం- చైనా …

Read More »

పిన్‌ కోడ్‌లోని ప్రతి డిజిట్‌కు ఒక అర్థముందని తెలుసా? దాన్ని ఎవరు కనిపెట్టారు? మొత్తం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోండి!

భారతీయ పిన్ కోడ్ వ్యవస్థ తపాలా సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 6-అంకెల కోడ్ దేశాన్ని 9 జోన్లు, ఉప-జోన్లు, జిల్లాలు, పోస్టాఫీసులుగా విభజిస్తుంది. మొదటి అంకె జోన్‌ను, రెండవది ఉప-జోన్‌ను, మూడవది జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు పంపడం తగ్గిపోయినప్పటికీ, చిరునామాపై రాసే ‘పిన్ కోడ్’ ఇప్పటికీ మన రోజువారీ లావాదేవీలలో అంతర్భాగం. ఆన్‌లైన్ షాపింగ్ నుండి బ్యాంకింగ్ వరకు, ప్రభుత్వ పథకాల నుండి అత్యవసర సేవల వరకు, ప్రతిచోటా …

Read More »

ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను …

Read More »

కజకిస్తాన్‌ రాయబారితో నవాబ్‌ మీర్‌ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్‌ నవాబ్‌ మీర్‌ నాసిర్‌ అలీఖాన్‌ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్‌ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్‌ రాయబారి.. ఏపీ, …

Read More »

ISSతో ఫాల్కన్‌-9 వ్యోమనౌక డాకింగ్‌ విజయవంతం.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా

అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్‌ వ్యోమ నౌక డాకింగ్‌ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్‌-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్‌.. జై భారత్‌ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నా భుజాలపై త్రివర్ణ పతాకం …

Read More »

అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

విజన్-2047 దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియాగా తీర్చిదిద్దుతున్నారు సీఎం చంద్రబాబు. ఆయన విజన్ నుంచి వచ్చినదే ఈ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’.. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..అమరావతి క్వాంటం వ్యాలీ – నేషనల్ వర్క్‌షాప్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ప్రసంగిస్తూ, క్వాంటం టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు దిశలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయాణాన్ని వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

పాస్ పోర్ట్ అప్లికేషన్ వేరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన వెరీ ఫాస్ట్ యాప్‌కు బెస్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి అందుకున్నారు.తెలంగాణ పోలీసులను వరుస అవార్డులు వరిస్తున్నాయి. ఇటీవలే జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర …

Read More »