టెక్నాలజీ

గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు! ప్రధాని మోదీ హర్షం

ప్రధానమంత్రి మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా, గుజరాత్‌లోని GIFT సిటీలో సైప్రస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), సైప్రస్ ఎక్స్ఛేంజ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇది GIFT సిటీని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తుంది.గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో సైప్రస్‌ స్టాక్‌ఎక్స్చేంజ్‌ ఏర్పాటు అవుతోంది. ఈ మేరకు మన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు, టర్కీ ఎక్స్చేంజ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. సైప్రస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష! కీలక నిర్ణయం..

జూన్‌ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 269 మంది మరణించారు. అయితే ప్రమాదంపై తాజాగా కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రమాదంపై చర్చించారు. ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసే కారణాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం. గత ప్రమాదాల రికార్డులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. విమానాల ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. భవిష్యత్‌లో …

Read More »

రెండు విడతల్లో కుల-జనగణన.. గెజిట్ విడుదల.. ఎప్పటివరకు వరకు పూర్తవుతుందంటే..

15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించింది కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం (1948లో 37)లోని సెక్షన్ 3 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ జనగణన చేపట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు విడుతల్లో జన గణన జరగనుంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జన గణన ప్రక్రియ ముగియనుంది. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జన గణన …

Read More »

ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న టైమింగ్..

డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ, భారతదేశంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తూ, కోట్లాది మంది ప్రజల ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో, జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనున్నాయి. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి …

Read More »

దూకుడుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్

తెలంగాణలో స్థిరాస్తి రంగం మళ్లీ ఊపందుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం 17.72 శాతం వృద్ధి నమోదైంది. దీనితో ఈ రంగం పుంజుకుంటోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతేడాది పోలిస్తే గణనీయమైన వృద్ధి 2023, 2024లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ప్రభావంతో స్థిరాస్తి రంగం కొంత మందగించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, ప్లాట్ల కొనుగోలు, …

Read More »

రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.. విమాన ప్రమాదంపై కమిటీ

విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి ముందు పైలట్‌ మేడే కాల్‌ చేశారని తెలిపారు.అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే.. ఈ విమాన ప్రమాదంపై విమానయాన శాఖ వివరణ ఇచ్చింది. విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియాకు …

Read More »

మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్‌డేట్‌ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది ఈ ప్రకటనకు సంబంధించిన …

Read More »

రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది.  ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల …

Read More »

దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్‌ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్‌ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్‌పూర్‌లోని సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్‌ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్‌ చేసిన టార్గెట్‌లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో …

Read More »

ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి 50 కి.మీ. దూరంలో ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పని చేస్తోంది.సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉన్న 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పూర్తి …

Read More »