ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది ఈ ప్రకటనకు సంబంధించిన …
Read More »రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల …
Read More »దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్ చేసిన టార్గెట్లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో …
Read More »ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నయా ప్లాన్..! రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రతి 50 కి.మీ. దూరంలో ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో కలిసి పని చేస్తోంది.సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఉన్న 973.70 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని పూర్తి …
Read More »రూ.1.34 లక్షల కోట్ల ఆదాయమే టార్గెట్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్లా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టేలా.. చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అభివృద్ధిలో ఏపీని టాప్లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? అవుతున్న ఖర్చు ఎంత? అనేదానిపై అధికారులతో లెక్కలు తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై …
Read More »క్యారకల్ – ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం
యుఎఇకి చెందిన ప్రముఖ చిన్న ఆయుధ తయారీదారు, EDGE గ్రూప్లోని ఒక సంస్థ అయిన క్యారకల్, మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్తో కలిసి హైదరాబాద్లోని ఐకామ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీలో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధ తయారీ సౌకర్యాన్ని ప్రారంభించాయి.దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL ) గ్రూప్ సంస్థ ఐ కామ్ సోమవారం …
Read More »ఢిల్లీలో బిల్గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు..!
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా బిల్గేట్స్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బిల్గేట్స్తో చంద్రబాబు చర్చించారు. 40 నిమిషాల పాటు వీళ్లిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ బిల్గేట్స్తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు. బిల్ గేట్స్తో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ …
Read More »AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, యువ మేధావి సిద్ధార్థ్ నంద్యాలను అభినందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కలుసుకున్నారు. కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ ‘సిర్కాడియావి’ని సిద్ధార్థ్ అభివృద్ధి చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 14 ఏళ్ల సిద్ధార్థ్ ఒరాకిల్, ARM లచేత గుర్తింపు పొందిన AI నిపుణుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హృదయ సంబంధ వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో విప్లవాత్మకంగా …
Read More »డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …
Read More »PMO, పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం, విక్రమాదిత్య పరిశోధన కేంద్రంలో ఒక వేద గడియారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యాప్ కూడా లాంచ్ కానుంది. ప్రారంభంలో, ఈ గడియారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేస్తారు.గత సంవత్సరం ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విక్రమాదిత్య వేద గడియారాన్ని ప్రారంభించారు. విక్రమాదిత్య వేద గడియారం ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం. ఇది భారతీయ సమయ …
Read More »