హైదరాబాద్లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ …
Read More »2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్గా…
2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్వైజర్ నుంచి అనుమతి పొందాలి.మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. …
Read More »ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో కీలక పరిణామం.. కేటీఆర్కు ఈడీ నోటీసులు..!
గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా E కార్ రేస్లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ను ఏ1గా చేర్చింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏ2గా, HMDA మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చింది ఏసీబీ.ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు(KTR) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు …
Read More »కొమురంభీమ్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి
అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ శివారులో రోడ్డుపై వెళుతుండగా పులి ప్రత్యక్షమై రైతులు, వాహనదారులను భయాందోళనకు గురి చేసింది స్థానికుల కేకలు విన్న పులి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి పారిపోయింది.నాన్నా పులి కథ కాదు కానీ.. బెబ్బులి సంచారంతో అక్కడ క్షణక్షణం భయంభయం. కొమురంభీమ్ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు దండోరా వేస్తున్నారు. పెంచికల్ పేట్ మండలం దర్గాపల్లిలో పులి సంచరిస్తోంది. ఈ పరిస్థితుల్లో …
Read More »ఓరి బాబోయ్.. అల్పపీడనం ముప్పు వీడనే లేదు.. ఈ లోపే
ఏపీకి వానల ముప్పు ఇంకా వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి…బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ …
Read More »ఆ మూడు మృతదేహాలపై బలమైన గాయాలు.. ఇంతకీ ఆత్మహత్యలా.. హత్యలా?
మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్.. ముగ్గురి నేపథ్యాలు వేర్వేరు. కానీ ఈ ముగ్గురికీ పరిచయాలు ఏర్పడింది బీబీపేట్ లోనే. ఇక్కడి నుంచి ప్రారంభమైన వీరి పరిచయాల పర్వం చివరకు పెద్ద చెరువులో ముగ్గురి మృతదేహాలు తేలేవరకు వెళ్లింది. గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరి డెడ్ బాడీలు బయటకు రావడం, వీరి శరీరాలపై బలమైన గాయాలు ఉండటం.. చెరువు గట్టుపై వీరి వస్తువులన్నీ ఉండటం.. అసలింతకీ ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అనే డైలమాలో పడేశాయి..ఒకే సమయంలో.. ఒకేచోట.. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఒక …
Read More »అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన …
Read More »ఇకపై డిగ్రీ థర్డ్ ఇయర్లో లాంగ్వేజ్ సబ్జెక్టులుండవ్.. అన్నీ కోర్ సబ్జెక్టులే
తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావిధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్కు స్వస్థి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్ ఇయర్లో కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్, సెకండియర్లోనే ల్యాంగ్వేజ్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. …
Read More »గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్క్లియర్.. ఆ ఏడు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే పిటిషన్ల దాఖలు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 29 అప్లోడ్ కాలేదన్న కారణాన్ని తోసిపుచ్చింది. ప్రిలిమ్స్ …
Read More »మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం.. శోకసంద్రంలో తెలుగువారు
మన్మోహన్ సింగ్ మృతితో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగాయి. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేశారు. ప్రతిష్టాత్మక పనికి ఆహార పథకాన్ని అనంతపురం వేదికగా ప్రారంభించారు. మరోవైపు మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.మన్మోహన్ సింగ్కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ప్రధానిగా పేదలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పేదలు పస్తులు ఉండొద్దన్న ఉద్దేశంతో పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించారు. అనంతపురంలో …
Read More »