తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక అశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి, తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్తో సహజీవనం చేసస్తున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ …
Read More »మారు మూల ప్రాంత పాఠశాలలో AI పాటలు.. అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థులు.
అదో అటవీప్రాంతం.. కానీ నగరాల్లోని కనిపించని తీరులో అక్కడి విద్యార్థినీ, విద్యార్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారు. అధికవేగంతో తెలంగాణా సర్కార్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ వేగంతో.. ఇప్పుడు మారుమూల పల్లెల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చొచ్చుకుపోతోంది. పెద్దపెల్లి జిల్లాలో ఓ మారుమూల పల్లెలో కనిపిస్తున్న ఆ విప్లవమే ఇప్పుడు చదువుతున్న వార్త. తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతో పాటు.. పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. అయితే ఇంకొన్ని …
Read More »కుషాయిగూడలో మిస్సింగ్.. దుర్గం చెరువులో తేలిన డెడ్బాడీ! ఏం జరిగిందో..
హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు. జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు …
Read More »సృష్టి ఫైల్స్.. తవ్వేకొద్దీ వెలుగులోకి సృష్టి అరాచకాలు.
ఆమె డాక్టరా లేక అక్రమార్జన రుచి మరిగిన మోసగత్తెనా? సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అరాచకం.. రెండు రాష్ట్రాలకే పరమితం అనుకున్నాం ఇప్పటిదాకా. కాదు.. డాక్టర్ నమ్రత మోసాలు దేశవ్యాప్తం. రాజస్తాన్ దంపతులకు సంతాన సాఫల్యం చేయిస్తానని చెప్పి అస్సాం దంపతులను పట్టుకొచ్చింది. పశ్చిమ బెంగాల్లో గతంలో ఓ కేసు నమోదైంది. దందా అంతా విశాఖ కేంద్రంగా జోరుగా సాగుతోంది కదా.. వ్యాపారాన్ని ఒరిస్సాకి కూడా విస్తరించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి.. అసలు డాక్టర్ నమ్రత అడుగుపెట్టని జిల్లానే లేదేమో. అండం బయటకు …
Read More »పర్యాటకులకు గుడ్న్యూస్… తెలంగాణ నయాగరకు అనుమతి.. డ్రోన్ దృశ్యాలు అద్భుతం
పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగిందేకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత …
Read More »స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్ టికెట్… బైపోల్ అభ్యర్థిపై పొన్నం కీలక వ్యాఖ్యలు
జూబిలీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్ టికెట్ దక్కుతుదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాగ్రెస్ నేత అజారుద్దీన్తో కలిసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్ లేదని పొన్నం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్లో ఇప్పటికే …
Read More »ట్రాక్ కెమెరాకు చిక్కిన చిరుత… హైదరాబాద్ శివారులో భయం భయం
హైదరాబాద్ శివారులో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి ఏ చిరుత దాడి చేస్తుందనే భయం వెంటాడుతోంది. 20 రోజుల్లో మూడు కీలక ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని గుర్తించారు. గోల్కొండ పరిసరాల్లో మళ్లీ చిరుత కనిపించింది. రాందేవ్ గూడలో మిలటరీ ఏరియాలో చిరుత రోడ్డు దాటింది. టిక్ పార్క్ నుంచి మిలటరీ ఏరియాలోకి వెళ్లింది చిరుత. తెల్లవారుజామున తిరిగి టెక్ పార్క్ లోకి చిరుత వెళ్లినట్లు ట్రాక్ కెమారాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత సంచరిస్తుండడంతో మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగి గూడ, …
Read More »నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ జల సవ్వడి.. వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.. ఈ నేపథ్యంలో మంగళవారం నాగర్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మంగళవారం ఎత్తివేశారు. 18 ఏళ్ల తర్వాత నాగర్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జునసాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీర్రెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద …
Read More »పీజీ ఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. తెలంగాణలో పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు …
Read More »కొలిక్కిరాని లోకల్ కోటా లొల్లి..! ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే లోకల్ కోటా పంచాయితీ ఇంకా.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. …
Read More »