తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పీఎస్లో గతంలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి అతని సోదురు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పెద్దిరాజు ఫిర్యాదును పరిగనణలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు నాడు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయతే ఈ కేసును …
Read More »గవర్నర్ ఆమోదిస్తారా..? నెక్స్ట్ ప్లాన్ ఏంటి..? బీసీ రిజర్వేషన్ల చుట్టూ పొలిటికల్ వార్..
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ నిర్ణయం కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం పెడతారా…? లేక న్యాయ, రాజ్యాంగ పరిశీలనకు పంపుతారా…? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే మాత్రం నిర్ణయం …
Read More »ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరంర ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు …
Read More »సీఐడీ కస్టడీకి హెచ్సీఏ నిందితులు… ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.హెచ్సీఏ కేసులో ఐదుగురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనుంది సీఐడీ. నిందితులను ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. హెచ్సీఏ క్లబ్స్లో అవకతవకలు, గత హెచ్సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది సీఐడీ. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, హెచ్సీఏ సీఈవో సునీల్, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత యాదవ్ను విచారించనుంది సీఐడీ. …
Read More »బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదే… బీఆర్ఎస్ వాళ్లు నా దారికి రావాల్సిందే: చిట్చాట్లో కవిత
ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న అంశమిది. …
Read More »ఏ క్షణమైనా సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్… రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం
తెలంగాణలో స్థానికసంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైంది. హైకోర్టు గడువులోపు ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. ఇప్పటికే ZPTC, MPTC, సర్పంచ్ స్థానాలు ఖరారు చేసింది. ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్ …
Read More »మందుబాటులు బీ కేర్ఫుల్.. ఇక పట్టపగలు కూడా చుక్కలే.. అలా దొరికారో అంతే సంగతి!
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మందేసి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్ల పనిపట్టేందుకు ఇకపై పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్ట్లు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ ప్రాంతంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సైతం పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా …
Read More »బండి సంజయ్కి మరోసారి సిట్ నోటీసులు… విచారణ కు సమయం ఇవ్వాలని కోరిన పోలీసులు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సిట్ మరోసారి నోటీసులు పంపింది. విచారణకు సమయం ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసుల్లో కోరారు. దీంతో ఈనెల 24న విచారణకు బండి సంజయ్ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ని సిట్ అధికారులు …
Read More »వ్యవసాయ రంగంలోనూ ఏఐ అద్భుతాలు.. ఇకపై డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం..!
ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేసే రైతులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గిపోతున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతులు తప్ప కొత్తగా ఎవరూ కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రైతు కనుమరుగైతే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతుంది. వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులు రానున్నాయా తెలుసుకుందాం పదండి. సాఫ్ట్ వేర్ రంగంలో అత్యాధునిక మార్పులు వస్తున్నట్లే వ్యవసాయ రంగం కూడా కొత్త …
Read More »కృష్ణా బోర్డు అక్కడ.. గోదావరి బోర్డు ఇక్కడ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో సంచలన నిర్ణయాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్, నిమ్మల రామానాయుడు, ఏపీ, తెలంగాణ సీఎస్లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ …
Read More »