తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీపాయింట్ …
Read More »డిగ్రీ అర్హతతో ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ ఇదే
ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్లలో అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, న్యూదిల్లీ, ఈశాన్య జోన్లలో ఖాళీగా ఉన్న..భారత ప్రభుత్వ ప్రజా సేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులన్నీ తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఆరు జోన్లలో …
Read More »ఐబీపీఎస్ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్… ఏ పరీక్ష ఎప్పుడంటే?
2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రివైజ్డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్ఆర్బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్ఏ, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ జాబ్స్ క్యాలండర్ విడుదలైంది. ఇందులో ఆర్ఆర్బీ, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సీఎస్ఏ, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న …
Read More »ఇంటర్ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 17 నుంచి జూన్ 23వ …
Read More »బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు! పరుగులు తీసిన సిబ్బంది
హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, CISF, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాన్ని ఖాళీ చేసి, బాంబు నిర్మూలన బృందం తనిఖీలు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది.ఇటీవలె అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో.. ప్రజల్లో విమానం పేరు వింటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. …
Read More »GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డు!
మే నెలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది.అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాదిమంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక …
Read More »తెలంగాణ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. జులై 14 నుంచి తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరులో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరైన సంగతి తెలిసిందే. కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్వీ)లు మంజూరయ్యాయి. ఈ 7 నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఆరో తరగతి ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 పాత విద్యాలయాలుండగా వాటిలో ప్రవేశాలు ముగిశాయి. కొత్త వాటిల్లో ఆరో తరగతి ప్రవేశాలు …
Read More »పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ..
టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడం కాక రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు మహేష్కుమార్గౌడ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి మరి.ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు …
Read More »సైబర్ మోసాలపై అప్రమత్తం కండి.. అలాంటి లింక్స్ను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..ఇటీవల కాలంలో …
Read More »నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్..
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …
Read More »