తెలంగాణ

డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..

భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్‌ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్‌ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …

Read More »

తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..p

డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్‌ ఏంటి..? డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో …

Read More »

తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు..! నారాయణపేట ముడమాల్‌ నిలువురాళ్లకు ఆ జాబితాలో చోటు..

ప్రపంచ వారసత్వ ప్రదేశం ట్యాగ్ కోసం ప్రతిపాదనను ఇప్పటికే భారత పురావస్తు సర్వేకు పంపారు. ముడుమాల్‌ లో ఉన్న ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశోధకులు చెబుతున్నారు. శిలాయుగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్టు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలోని 3,000 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెన్‌హిర్స్ స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం భారతదేశం నుండి తాత్కాలిక జాబితాలో చేర్చింది. భవిష్యత్తులో దేశాలు …

Read More »

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్‌ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.సైబర్‌ కేటుగాళ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్‌ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను …

Read More »

ఎమ్మెల్యేకు తప్పని న్యూడ్ కాల్ బెదిరింపులు.. సైబర్ నేరగాళ్లతో వీరేశం పరేషాన్!

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల అమాయకులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై అశ్లీల వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేశారు. నల్లగొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సెల్‌ఫోన్‌లోకి చొరబడి సైబర్ ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్‌లో నుండి ఫోటోలను సేకరించిన సైబర్ క్రిమినల్స్.. …

Read More »

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి …

Read More »

ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

EPFO: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది..దేశంలోని 7.6 కోట్ల EPFO​ ​సభ్యులపై కీలక ప్రకటన వెలువడింది. 2024-25 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) పై వడ్డీ రేటు 8.25%గా నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఈపీఎఫ్‌వో​ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి …

Read More »

ఒక్కడు.. వంద అనుమానాలు..! దుబాయ్‌లో చనిపోతే తెలంగాణలో ప్రకంపనలు!

హైదరాబాద్ వదిలి దుబాయ్‌లోనే సెటిల్ అవ్వాలని కేదార్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి దుబాయ్ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారాలు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం ఉంది. దుబాయ్‌లోని ఓ పెద్ద ల్యాండ్‌ డెవలపింగ్‌ కంపెనీలో కేదార్‌ కీలక వాటాదారుగా ఉన్నారని కూడా చెబుతున్నారు.ఆయనో ప్రొడ్యూసర్. దురదృష్టవశాత్తూ దేశం కాని దేశంలో చనిపోయాడు. ఆయన మరణం టాలీవుడ్‌ను కలచివేసింది. తెలంగాణలోని ప్రముఖులనూ కదిలించింది. కానీ ఇదంతా ఆయన మరణంతో వచ్చిన సానుభూతా…లేక బినామీగా ఉన్నాడన్న అనుమానంతో వచ్చిన సునామీనా.? దుబాయ్‌లో తీగలాగితే.. …

Read More »

నేటితో ముగియనున్న కుల గణన సర్వే! ఇంకా వివరాలు ఇవ్వని వాళ్లు ఏం చేయాలంటే..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా పాల్గొనని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ పోర్టల్, ఎంపీడీవో కార్యాలయాలు ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు.గతంలో జరిగిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుండి 28 వరకు ఇంతకు ముందు సర్వేలో పాల్గొనని వారి కోసం కుల గణన సర్వే …

Read More »

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో నిర్వహించిన కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం, గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల్లేని సుమారు 83,000 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 70 శాతం కుటుంబాలు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పారదర్శకత …

Read More »