తెలంగాణ

హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి.. మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మైక్రోసాఫ్ట్ ఇండియా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ తర్వాత క్యాంపస్ అంతా తిరిగి పరిశీలించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. …

Read More »

సర్వే పేరుతో ఇంటి తలుపు కొట్టారు.. ఆపై వివరాలు అడుగుతూ.. ఒక్కసారిగా..

మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అపరిచిత వ్యక్తులు తలుపుకొడితే అస్సలు తీయకండి. సర్వే అంటూ ఇంటికొచ్చినా.. లేదా మరో పేరు చెప్పినా అస్సలు డోర్లు ఓపెన్ చేయకండి. ఎందుకంటే వారు దొంగలు కావొచ్చు.. మీ ఇల్లు కొల్లగొట్టొచ్చు. తాజాగా ఖమ్మం జిల్లా పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది….ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. సర్వే పేరుతో, ఇంకా ఏ ఇతర అవసరాల కోసమే తలుపు కొడితే ఒక్క క్షణం ఆలోచించండి. తలుపు తీశారో.. మీ ఇల్లు గుళ్లవుతుంది. ప్రతిఘటిస్తే.. …

Read More »

తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే.. ఎప్పటినుంచంటే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్‌పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతోపాటు.. మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కులగణన సర్వే రిపోర్ట్‌ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే చేపట్టనున్నట్లు …

Read More »

జూనియర్‌ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు.. ఇంటర్‌ బోర్డు సీరియస్‌ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియకముందే పలు ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు చేపట్టసాగాయి. దీంతో పలువురు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది..రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు క్యూ కట్టాయి. దీనిపై ఇంటర్‌ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. …

Read More »

డీఎస్సీ 2008 అభ్యర్థులకు భారీ ఊరట.. వారంలో పోస్టింగ్‌లు!

2008 డీఎస్సీ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. యేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారం హైకోర్టు జ్యోక్యంతో గాడినపడింది. దీంతో మరో వారం రోజుల్లో నాటి డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్ లు ఇచ్చేందుకు సర్కార్ కార్యచరణ రూపొందిస్తుంది. అయితే ఈ సారైనా ప్రభుత్వం మాటమీద నిలబడుతుందో.. లేదో.. అన్నది వేచిచూడాల్సిందే..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు. దీంతో మరో మారు డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు …

Read More »

పదో తరగతి మార్కులతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్షలేదు

తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి పాసైన వారికి తపాలా శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం వంటి ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా ఇండియా పోస్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీలను …

Read More »

తెలంగాణాలో బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్ పేరు వింటేనే చమట్లు పడుతున్నాయిగా..  ఇంతకీ ఏంటీ వైరస్..?

తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.బర్డ్ ఫ్లూ… ఇది చైనా బ్రీడేనండోయ్.. దీనినే ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువుల్లో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990 సంవత్సరం …

Read More »

తెలంగాణ కుంభమేళా.. నేటి నుంచి మేడారం మినీ జాతర షురూ.. విశేషం ఏంటంటే..

సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది.. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు.. మినీ జాతర విశిష్టత ఏంటి..? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు.? రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితీ… కానీ క్రమక్రమంగా మినీ జాతర కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుంది.. ఈ నేపథ్యంలోనే మినీ జాతర కూడా ప్రాశస్త్యంలోకి వచ్చింది.. ఫిబ్రవరి 12, 13, 14, …

Read More »

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్.. నేడు కీలక సమావేశం

త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఉంటాయా లేదా అనే దానిపై ఇవాళ కాస్త క్లారిటీ రానుంది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్‌ నొక్కొచ్చు. అటు సర్కార్‌ ఇటు స్టేట్ ఎలక్షన్‌ కమిషన్‌ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణ పై ఆయా పార్టీలతో SEC సమావేశంలో …

Read More »

వీరరాఘవ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు..

దేవుడి పేరు చెప్పి దందాలు చేసే బ్యాచ్‌లు ఎక్కడపడితే అక్కడే కనిపిస్తున్నాయ్.. ఇలాంటి వాళ్లలో వీరరాఘవరెడ్డి తీరు వేరే లెవెల్‌..! ఇతని రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం తన ప్లాన్ అమలు చేసేందుకు ప్రైవేట్‌ ఆర్మీని రెడీ చేసుకున్నాడు.. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి మొదటి స్లాట్‌లో 5 …

Read More »