తెలంగాణ

టీజీ సీపీగెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. …

Read More »

వారు పార్టీ మారారు.. సాక్ష్యం చూపిస్తున్న కేటీఆర్.. నెక్స్ట్ ఏం జరగనుంది..?

అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్‌ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్‌ నోటీసులతో.. ఇప్పుడు సీన్‌ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్‌ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్‌ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై “తాడోపేడో” అంటుండగా, మరికొందరు సైలెంట్‌గా ఏం జరుగుతుందో చూసే యోచనలో …

Read More »

పర్మిషన్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే.. ఏసీబీకి చిక్కిన మరో లేడీ ఆఫీసర్!

రాష్ట్రంలో అవినీతి పరులను ఏరిపారేడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్న ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుపడింది. హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారిక లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుపడ్డారు. అమె నుంచి రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న కొందరిలో మాత్రం అస్సలూ మార్పు రావడం లేదు. మనల్ని ఎవరులే పట్టుకునేది అనేలా జనాల నుంచి లంచాలు …

Read More »

అవిభక్త కవలలు వీణా-వాణీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు..? వారి పరిస్థితేంటీ..?

హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ స్టేట్ హోమ్‌‌లో నివసిస్తున్న అవిభక్త కవలలు వీణా, వాణి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కలిసే ఉన్న ఈ ఇద్దరూ చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇటీవల డిగ్రీలో డిస్టింక్షన్‌ సాధించి ఇప్పుడు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) కోర్సు కంప్లీట్ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేయడం తాము ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవడంతో.. సీఏ చేయాలని నిర్ణయించుకున్నట్లు వీణా-వాణిలు చెబుతున్నారు. ఈ అభివక్త కవలల రోజు ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. తొలుత తెలుగు, ఇంగ్లీషు పేపర్స్ …

Read More »

తిరిగి పార్టీలోకి వచ్చేయండి.. తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఆ నేతలే టార్గెట్‌గా..

తెలంగాణ కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కి శ్రీకారం చుట్టిందా.. గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి వెల్‌కమ్‌ పలుకుతారా?.. పార్టీ వీడిన వారిలో సీనియర్లు ఎవరున్నారు. పాత వాళ్లని మళ్లీ వెనక్కి పిలవడం వల్ల కాంగ్రెస్‌కు ఏం లాభం.. అసలు సడెన్‌గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది ఈ కథనంలో తెలుసుకోండి.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం, ఇతర నేతలతో విభేదాల కారణంగా …

Read More »

గ్రూప్‌ 1పై హైకోర్టు సంచలన తీర్పు.. మెయిన్స్‌ ఫలితాలు రద్దు!

ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని 20 మంది అభ్యర్థులు ఈ పిటీషన్లలో కోరారు.  తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీ గ్రూప్ 1పై బుధవారం (సెప్టెంబర్‌ 9) సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను ధర్మాసనం రద్దు చేసింది. ఈ మేరకు గ్రూప్‌1 మెయిన్స్‌ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. మెయిన్స్‌ …

Read More »

సినీ ప్రముఖుల ఇళ్లకు అదే పనిగా వెళ్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్.. ఏంటా అని ఆరా తీయగా

హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులను వేధించిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉమామహేశ్వరరావు చివరికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానంటూ సినీ సెలబ్రిటీలను భయపెట్టడం, వారి ఇళ్లకు వెళ్లి వేధించడం, పెద్ద ఎత్తున బెదిరింపులు గురిచేయడం వంటి పనులతో.. కలకలం రేపిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడి వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు, తన హోదాను మించిపోయి ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకుంటూ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తన వాట్సాప్‌ డీపీ, స్టేటస్‌లలో ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ …

Read More »

సీఎం ఇల్లు అయితేనేం.. కూల్చేయాల్సిందే..! అందరికీ ఆదర్శంగా రేవంత్ రెడ్డి..

అభివృద్ధి విషయంలో తరతమ భేదాలు చూడకూడదని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ మాటను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టిన 4 లేన్ల రోడ్డు నిర్మాణ పనుల వేళ.. తన ఇంటి ఇంటి ప్రహరీ అడ్డు రావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే కూల్చేయాలని ఆదేశాలిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని మొత్తం 43 ఇళ్లను పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలతో.. కొండారెడ్డిపల్లిలో …

Read More »

ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అయితే ఉభయ సభల్లో.. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ …

Read More »

తండ్రిని చంపి తల, మొండెం వేరు చేసిన కసాయి కొడుకు.. ఎందుకో అస్సలు ఊహించలేరు!

మూఢనమ్మకాల అనుమానం, భూతగాదాలతో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. తండ్రి ఒంటరిగా పొలం వద్ద పనులు చేస్తుండగా తన మేనల్లుడితో పాటు అక్కడికి వచ్చిన కుమారుడు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ లో వృద్ధుడు చాగొండ బాలయ్య నివాసం …

Read More »